ఇటిక్యాల, నవంబర్ 28 : జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని జింకలపల్లె, మునగాల, కొండేర్, షేక్పల్లె, సాసనూల్, దువాసిపల్లె గ్రామాల్లో జూరాల ఆయకట్టు కింద, నీటివసతి ఉ న్న చోట ఎక్కువగా వరి సాగు చేసేవారు. ఆరుతడి పంటలు పండే ఎర్రమట్టి నేలలు ఉన్నా.. రైతులు వానకాలం, యాసంగిలో వరి పండించేవారు. మూ సపద్ధతిలో ఒకే రకమైన పంట పండించడం వల్ల ది గుబడి రాక నష్టాల పాలయ్యారు. అంతేకాకుండా అందరూ ఒకేసారి వరి సాగుకు పూనుకోవడంతో కూలీలు, బాడుగకు ట్రాక్టర్లు దొరకక ఇబ్బందులు పడేవారు. వరి సాగుతో విసిగిపోయిన కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి మరల్చారు. బెండ సాగును ఎంచుకొని అధిక లా భాలను ఆర్జిస్తూ మండలంలోని రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
బెండసాగుతో అధిక లాభాలు..
ఆయా గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులు వ రికి ప్రత్యామ్నాయంగా బెండ సాగు చేస్తూ రెండేండ్లుగా అధిక లాభాలు అర్జిస్తున్నారు. ప్రతి ఏడాది మే చివరలో లేదా జూన్ మొదటి వారంలో బెండ విత్తనాలు విత్తుతున్నారు. ఎకరాకు ఖర్చులు పోను రూ.లక్ష పైగా సంపాదిస్తున్నారు. దీంతో ఆయా గ్రా మాల్లో బెండ సాగుచేసే రైతుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తున్నది. రైతులు తమ పొలంలో ఒకరిద్దరు కూలీలతో పంట సాగుచేస్తూ రోజూ నికరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. ముందుగా జింకలపల్లె, కొండేర్, మునగాల గ్రామాల్లో కొద్దిమంది రై తులు బెండ సాగుచేశారు. మంచి దిగుబడి సాధించారు. దీంతో ఆయా గ్రామాల రైతులే కాకుండా చు ట్టు పక్కల పల్లెల్లోని రైతులు ఈ పంట సాగుపై ఆ సక్తి కనబరిచారు. సదరు రైతులు ఇప్పటివరకు నష్టాలను చవిచూడకపోవడం కొసమెరుపు.
సులభంగా మార్కెట్..
ఇక్కడ పండించిన పంటను హైదరాబాద్లోని గుడ్డిమల్కాపూర్ మార్కెట్కు తరలిస్తారు. మార్కెట్ కు తరలించేందుకు మొదట్లో రవాణా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు అధిగమించారు. ఏటేటా పెరుగుతున్న బెండ సాగుతో గ్రామాల్లోని కొందరు యువకులు వాహనాలు కొ నుగోలు చేసి మార్కెట్కు తరలించి ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్లోని మార్కెట్ యజమాను లు రైతులకు రోజు వారీ లేదా వారం రోజుల చెల్లింపులు రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. దీంతో సులభంగా పంటను విక్రయించి ఆదాయాన్ని పొం దుతున్నారు. ఏటా ఒకే రకం పంట పండించి న ష్టాల పాలయ్యే బదులు ఇలా ప్రత్యామ్నాయ పంట లు వేయాలని రైతులు చెబుతున్నారు.
మంచి ఆదాయం వస్తున్నది..
నాకున్న ఎకరా పొలంలో నాందారి అనే రకం బెండను ఆగస్ట్లో విత్తాను. పంట సా గుకు ముందు పొలంలో గొర్రెల మందను నిలిపాను. కిలో రూ.మూడు వేల చొప్పున రెండు కిలోల విత్తనాన్ని విత్తాను. ఎకరాలో సాగు చేసేందుకు విత్తనాలు, ఎరువులు, కూలీలకు కలిపి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. సాళ్ల మధ్య రెండు ఫీట్ల దూరం తో గింజలను నాటాను. 50 రోజుల తరువాత పంట చేతికొస్తుంది. రోజు విడిచి రోజు కాయలను కోస్తాం. 3 నుంచి 4 క్వింటాళ్ల కాయ వస్తుంది. పంట పూర్తయ్యేవరకు 30 కోతల వరకు వస్తుంది. పంట దిగుబడి తగ్గినా.., పురుగుల తాకిడి పెరిగినా యాజమాన్య పద్ధతులు పాటించాలి. విచ్చలవిడిగా మందులు చల్లొద్దు. నేను, నా భార్యకు తోడు ఒక కూలి మనిషితో కాయలు కోస్తాం. బెండ కాయలను గుడ్డిమల్కాపూర్ మార్కెట్కు తరలిస్తున్నాం. అక్కడి యజమానులు ఖా తాలో డబ్బులు వేస్తున్నారు. పంట పెట్టుబడి పోను మంచి ఆదాయం వచ్చింది. – బీచుపల్లి, రైతు, జింకలపల్లె
వరి కంటే బెండ సాగు మేలు..
వరి కంటే బెండ సాగు ఎంతో మేలు. ఏ డాది పొడవునా నిలకడగా ఆదాయం వ స్తుంది. ప్రస్తుతం రెండెకరాల్లో సాగు చేస్తున్నాను. యూఎస్ 008 కేజీ విత్తనాన్ని రూ.3,800 చొప్పున ఎకరాకు మూడు కేజీ ల విత్తనాన్ని నాటాను. పొలంలో చిన్న గుంటుకతో బోదెలు చేసి విత్తనాలు విత్తా ను. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే 120 నుంచి 150 రోజుల వరకు దిగుబడి వస్తుంది. కాయలను మా గ్రామంలో ఉన్న బొలేరో వాహనంలో మార్కెట్కు తరలిస్తున్నాం. ప్రస్తుతం డిమాండ్ బాగా ఉన్నది. మా గ్రామంలో 500 ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఏటేటా సాగు పెరుగుతున్నది. ఎప్పుడూ నష్టం రాలేదు.