వనపర్తి టౌన్, ఫిబ్రవరి 4: స్వాతంత్య్ర స్ఫూర్తితో ప్రజలకు న్యాయ సేవలందించాలని హైకోర్టు జడ్జి సూరిపల్లి నంద అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కోర్టులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో న్యాయశాస్త్రంలో ప ట్టా పొందిన వారే అధికంగా పాలన కొనసాగించారన్నా రు. అంతకుముందు స్వాతంత్య్ర ఉద్యమంలో న్యాయశాస్త్రం చదివిన వారి పాత్ర గణనీయంగా ఉండేదని గు ర్తుచేశారు. మదన్మోహన్ మాళవియా, లాలాలజపతిరాయ్, సురేంద్రనాథ్ బెనర్జీ, మోతీలాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ, అంబేద్కర్ తదితరులు న్యాయవాద వృత్తి లో చురుకైన పాత్ర పోషించి స్వాతంత్య్ర సాధనకు కృషిచేశారన్నారు.
న్యాయవాద వృత్తి సమాజంలో ఎంతో విలువైనదని, ఎంతోమందికి న్యాయసేవలందించే అవకాశం కలుగుతుందన్నారు. ప్రజలకు న్యాయసేవలు అం దించేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషిచేయాలన్నారు. లోక్అదాలత్ ద్వారా కక్షిదారులతో రా జీమార్గంలో కేసులు పరిష్కరించాలన్నారు. అట్టడుగువర్గాల ప్రజలకు న్యాయవ్యవస్థపై అవగాహన కలిగించాలన్నారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి నాగార్జున మాట్లాడుతూ న్యాయసేవలపై ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయని, లోక్అదాలత్ బలోపేతానికి కృషి చేస్తున్నాయని గుర్తుచేశారు. కేసుల సంఖ్య పెరగడం, అవసరమైన న్యాయమూర్తులు లేకపోవడం తదితర కారణాలతో కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతుందన్నారు.
వనపర్తి జిల్లా కోర్టులో అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషిచేస్తానన్నారు. ఈ జిల్లాకు చెందిన వ్యక్తినయినందుకు సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా కలెక్టర్ తేజస్ నందలాల్పవార్ మాట్లాడుతూ జిల్లా కోర్టులో వసతుల కల్పనకు ప్రణాళిక తయారు చేసి పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. అంతకుముందు మహిళా న్యాయవాదుల చాంబర్, కోర్టు ఆవరణలో నిర్మించిన సీసీరోడ్డు, న్యాయసేవల హెల్ప్ డెస్క్ను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి హుజీబ్ అహ్మద్ఖాన్, న్యాయమూర్తులు రజిని, రవికుమార్, శిరీష, జేసీ వేణుగోపాల్, ఆర్డీవో పద్మావతి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు భరత్కుమార్, కార్యదర్శి విజయ్భాస్కర్, పోలీస్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
గద్వాల అర్బన్, ఫిబ్రవరి 4: స్వాతంత్య్ర ఉద్యమంలో న్యాయవాద వృత్తిలో ఉండి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నాయకుల స్ఫూర్తితో నేటి న్యాయవాదులు న్యాయవ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని హైకోర్టు న్యాయమూర్తి సూరిపల్లి నంద పేర్కొన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో సూరిపల్లి నంద, తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నాగార్జున కంటివెలుగు శిబిరాన్ని, లైబ్రెరీని ప్రారంభించారు. అంతకుముందు కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా జడ్జిలు హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ పరిపాలన విభాగంలో జిల్లా కోర్టులో మౌలిక సదుపాయాలకు హైకోర్టు ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ కోర్టు సముదాయానికి పదెకరాల భూమిని కేటాయించామని, ఐడీవోసీ కార్యాలయం ప్రారంభమయ్యాక కోర్టు ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. గద్వాల కోర్టులో పనిచేసిన వెంకటేశ్గౌడ్ స్మారకార్థం ఆయన సతీమణి న్యాయవాది వరలక్ష్మి గ్రంథాలయం కోసం 100పుస్తకాలను వితరణ చేశారు. కార్యక్రమంలో జిల్లా జడ్జిలు కనకదుర్గ, కవిత, అనిరోజ్, ప్రభాకర్, గంట కవిత, గాయత్రీ, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.