గట్టు, నవంబర్ 30: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నివర్గాలకు చేయూత లభిస్తోందని కన్జ్యూమర్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ గట్టు తిమ్మప్ప పేర్కొన్నారు. ముచ్చోనిపల్లి రిజర్వాయర్లో బుధవారం గట్టు తిమ్మప్ప మత్స్యశాఖ జిల్లా అధికారిణి షకీలాభాను, జెడ్పీటీసీ బాసు శ్యామలతో కలిసి చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కులాలు, చేతివృత్తులవారు ఎలాంటి ఆదరణకు నోచుకోలేదని విమర్శించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల, అన్నికులాల వారికి సమన్యాయం చేస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమఫలాలు అందని కుటుంబం ఏదీ లేదన్నారు. రైతుబంధు, రైతుబీమాతో రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బొజ్జయ్యనాయుడు, విజయ్నాగిరెడ్డి, నర్సింహులు, రాజు, రాముడు తదితరులు పాల్గొన్నారు.