జడ్చర్లటౌన్, జూలై27 : వారం రోజులుగా కు రుస్తున్న వర్షాలతో జడ్చర్ల మండలంలో వాగులు, కుంటలు, చెరువులు నిండుకుండలా మారటంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీసు, రెవెన్యూ అ ధికారులు విస్త్రతంగా చర్యలు చేపట్టారు. అన్ని గ్రా మాల్లో చాటింపులు వేయించి ప్రజలను అప్రమ త్తం చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉం డొద్దని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, కరెంట్ స్తం భాలను ముట్టుకోవద్దని సూచిస్తున్నారు. వాగు లు, చెక్డ్యాంలు, చెరువుల వద్దకు వెళ్లొద్దని చా టింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నా రు. జడ్చర్ల మండలం ఆల్వాన్పల్లి గ్రామ శివారులోని దుందుభి నదిని జిల్లా అదనపు ఎస్పీ రాము లు, మహబూబ్నగర్ డీఎస్పీ మహేశ్గౌడ్, సీఐ రమేశ్బాబుతో కలిసి పరిశీలించారు. దుందుభి నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ప్రజలెవరూ నదిలోకి వెళ్లొద్దని అదనపు ఎస్పీ రాములు సూచించారు.
అదేవిధంగా మహబూబ్నగర్ ఆర్డీవో అనిల్, జడ్చర్ల తాసీల్దార్ లక్ష్మీనారాయణ దుందుభి వాగును సందర్శించి నీటి ప్ర వాహం గురించి ఆరా తీశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగంగా జడ్చ ర్ల సీఐ రమేశ్బాబు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బం ది మండలంలోని కోడుగల్, చిన్నఆదిరాల, కొండే డు, ఆల్వాన్పల్లి, లింగంపేట గ్రామాల్లో వాగు, చెరువులు, కుంటలను పరిశీలించారు. వాగు పరివాహాక ప్రాంతాల్లో వెళ్లకుండా ముళ్లపొదలను వేయించి రైతులకు జాగ్రత్తలు చెబుతూ అవగాహ న కల్పించారు. అదేవిధంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ అధికారులు, పాలకవర్గం సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమిషనర్ మహమూద్షేక్ వార్డులవారీగా తిరిగి శిథిలావస్థలో ఉన్న ఇం డ్లలో నివాసిస్తున్న వారిని అప్రమత్తం చేస్తున్నారు. జడ్చర్ల మండలం లింగంపేటలో ఓ ఇల్లు, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని సంజీవయ్యకాలనీలో ఓ ఇల్లు కూలిందని, కూలిన ఇండ్ల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదికను పంపిస్తున్నట్లు రెవెన్యూ ఆర్ఐ రఘు తెలిపారు.
మిడ్జిల్లో..
మిడ్జిల్, జూలై 27 : మండలంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసీల్దార్ రాజీవ్రెడ్డి, సీఐ జమ్ములప్ప అన్నారు. గురువారం మండంలోని కొత్తూర్, వ స్పుల్ గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాతబడిన ఇండ్లు, దుందుభి వాగులోని చెక్డ్యాములను, అలుగుపారుతున్న దృశ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్ల కింద, శిథిలవాస్థ భవనాల్లో ఉండకూండదని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎస్సై రామ్లాల్నాయక్, ఆర్ఐ రామాంజనేయులు, సర్పంచు ల సంఘం మండలాధ్యక్షుడు జంగిరెడ్డి, నాయకు లు ప్రతాప్రెడ్డి, బాలు, సత్యంగుప్తా పాల్గొన్నారు.
దేవరకద్రలో 57 మి.మీ. వర్షపాతం
దేవరకద్ర, జూలై 27 : దేవరకద్ర నియోజకవర్గంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. దేవరకద్రలో 57మి.మీ వర్షపాతం నమోదు అయింది. మండలంలోని కో యిల్సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చెరడంతో గురువారం సాయంత్రం నాటికి ప్రాజెక్టు లో 22.5 అడుగుల నీటి వచ్చిచెరింది. మండలంలోని గూరకొండ, బస్వాపూర్, పెద్దరాజమూర్, చిన్నరాజమూర్, బండర్పల్లి, గోపన్పల్లి గ్రామ సమీపంలో ఉన్న వాగులు, చెక్డ్యాంలు పూర్తి స్థా యిలో నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్ష్మీపల్లిలో ఇండ్లలోకి వర్షం నీరు వచ్చి చేరడంతో ప్ర జలు అందోళన చెందుతున్నారు. మండల కేంద్రం లో బారీ వర్షం కురువడంతో ఇండ్ల మధ్య నీరు చేరడంతో ఎంపీడీవో శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి సీతానాయక్ జేసీబీలతో కాలువ ద్వారా నీటిని పట్టణంలోని మల్లేలప్పయకుంటలోకి కాలువల ద్వారా తరలించారు.
కోయిలకొండలో..
కోయిలకొండ, జులై 27 : మండలంలోని ద మయపల్లి, అభంగపట్నం, అంకిళ్ల, అయ్యావారిపల్లి, చందాపూర్ గ్రామాల్లో ఎంపీడీవో జయరాం పర్యటించారు. దమయపల్లి చెరువుకు వరద తీ వ్రంగా వస్తుందని నేడో రేపో అలుగు పారుతుందని పేర్కొన్నారు. అంకిళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాగు, కోయిల్సాగర్ పరిసర అం కిళ్ల, అయ్యావారిపల్లి, చందాపూర్ గ్రామాల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాజాపూర్లో..
రాజాపూర్, జూలై 27 : మండలంలోని బాలానగర్, గుండ్లపోట్లపల్లి, అగ్రహారంపోట్లపల్లి, ఈద్గాన్పల్లి గ్రామాల్లో వాగు ఉధృతంగా ప్రహించడం తో చెక్డ్యామ్లు నిండాయి. ఇటు నవాబుపేట నుంచి వచ్చే దుందుభి వాగు పరివాహక గ్రామా లు దోండ్లపల్లి, చెన్నవెల్లి, కుచ్చర్కల్, రాజాపూర్, మల్లెపల్లిలోని వాగు ప్రవహిస్తుంది.
బాలానగర్లో..
బాలానగర్, జూలై 27 : కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. మండ ల కేంద్రంతోపాటు గుండేడ్, పెద్దాయపల్లి, గౌతాపూర్, బోడజానంపేట గ్రామాల్లో గురువారం చెక్డ్యాంలు నిండి జలకళ సంతరించుకున్నది. బాలానగర్, మోతిఘణపూర్, నందారం, మాచారం, సురారం, గుండేడ్, ఉడిత్యాల, పెద్దరేవల్లి తదితర గ్రామాల్లో చెరువులు, కుంటల్లో బారీ వరద వ చ్చింది. వాగుల సమీపంలో ఉన్న పంట పొలాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. పలుగుమీది తం డాకు వెళ్లే రోడ్డుపై నీళ్లు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని ఆయా గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండొద్దని తాసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. గంగాధర్పల్లి, పెద్దరేవల్లి గ్రామాల్లో వర్షానికి కూలిన ఇండ్లను ఆ యన పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాసులు, ఆర్ఐ వెంకట్రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ బాబు రావు, ఎంపీడీవో కృష్ణారావు ఉన్నారు.
నవాబ్పేటలో..
నవాబ్పేట, జూలై 27 : కురుస్తున్న వర్షాలకు మండలంలోని లోకిరేవు, ఇప్పటూరు, కారూర్ వాగుల్లో నిర్మించిన చెక్ డ్యామ్లు నిండి మత్తడి దుంకుతున్నాయి. అలాగే యన్మన్గండ్ల పెద్దచెరు వు, ఇప్పటూర్ లెంకల చెరువు, లోకిరేవు, పెద్దచెరువు, కొల్లూరు, చౌడూరు చెరువులకు వర్షం నీరు వచ్చి చేరి జలకళ సంతరించుకున్నది.
గండీడ్లో..
గండీడ్, జూలై 27 : ముసురు వర్షాలతో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని తాసీల్దార్ జ్యోతి తెలిపారు. గురువారం మండలంలోని రంగారెడ్డిపల్లిలో కూలిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో మాట్లాడుతూ పాడుబడిన ఇండ్లల్లో ప్రజలు నివాసం ఉండరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో రూపేందర్రెడ్డి ఉన్నారు.
మహ్మదాబాద్లో..
మహ్మదాబాద్, జూలై 27 : ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, చెరువులు, అలుగులను దాట డం ప్రమాదకరమని మహ్మదాబాద్ తాసీల్దార్ ఆంజనేయులు తెలిపారు. మండలంలోని అన్నారెడ్డిపల్లి వాగును ఆయన పరిశీలించారు. అనంత రం మహ్మదాబాద్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి చత్రునాయక్ ఉన్నారు.
భూత్పూర్లో..
భూత్పూర్, జూలై 27 : వారం రోజులుగా కు రుస్తున్న ముసురు వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, కమిషనర్ నూరుల్నజీబ్ గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు లో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో ఉ న్న పాత ఇండ్లను పరిశీలించారు. పాత ఇండ్లలో నివాసం ఉండొదని మున్సిపల్ చైర్మన్ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మేనేజర్ అశోక్రెడ్డి, కుర్మయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.
కౌకుంట్ల మండలంలో..
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), జూలై 27 : ఇటీవల కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో పాత ఇండ్లు కూలిపోయాయి. కౌకుంట్ల మండలం వెంకటగిరి లో బుధవారం రాత్రి కుమ్మరి అషమ్మకు చెందిన ఇళ్లు కూలిపోయి ఇంట్లోని ధాన్యం, బట్టలు పాడైపోయాయని బాధితులు తెలిపారు. రెవెన్యూ ఆర్ ఐ జమీల్ కూలిపోయిన ఇంటిని పరిశీలించి పంచనామా నిర్వహించారు.
వరదలో వాగు దాటోద్దు
మూసాపేట(అడ్డాకుల), జూలై 27 : వాగులో వరద వస్తున్న సమయంలో వాగు దాటోద్దని తాసీల్దార్ కిషన్, ఎస్సై మాధవరెడ్డి సూచించారు. గురువారం వారు అడ్డాకుల మండలంలోని వర్నె వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తడిసి ఉన్న కరెంట్ స్తంభాలను పట్టుకోవద్దుని, పాత ఇండ్లలో ఉండోద్దని ప్రజలకు సూచనలు చేశారు.