పాలమూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి భానుడి భగభగలకు ఉక్కపోతకు గురైన పట్టణ ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం రావడంతో ఉపశమనం కలిగింది. అదేవిధంగా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. రామయ్యబౌలి, న్యూటౌన్ కాంప్లెక్స్, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలువడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమై నీటిని తొలగించారు.
– నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్, మే 17