మహబూబ్నగర్, మార్చి 21 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : పల్లె దవాఖానలకు ఎంబీబీఎస్, బీఏఎంఎస్ డాక్టర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హెల్త్ సబ్ సెంటర్లలో ఆరోగ్య సేవలు మెరుగుపర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే వీటిని అప్గ్రేడ్ చేయగా.. ఉమ్మడి జిల్లాలో 475 హెల్త్ సెంటర్ల స్థాయిని పెంచారు. మహబూబ్నగర్ జిల్లాలో 129, నారాయణ పేటలో 43, గద్వాల జిల్లాలో 81, నాగర్కర్నూల్లో 124, వనపర్తిలో 98 కేంద్రాలను అప్గ్రేడ్ చేశారు. వైద్యుల నియామకంతోపాటు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టింది. ఒక్కో సెంటర్కు రూ.20 లక్షలతో పక్కా భవనాన్ని నిర్మిస్తున్నారు. చాలా చోట్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. గ్రామీణ ్రప్రాంతాల్లో నివాసం ఉండే మహిళలు నెలనెలా చెకప్ చేసుకొని వారి హెల్త్ ప్రొఫైల్ను మెయింటనెన్స్ చేసే అవకాశం ఉన్నది. ఈ మేరకు వారికి చికిత్సలు అందించేందుకూ వీలు కానున్నది. ఇకపై వైద్య చికిత్సల్లో ప్రైవేటు దవాఖానలకు సైతం బస్తీ వైద్యశాలలు సవాల్ విసరనున్నాయి.
గ్రామీణ ప్రాంతాల హెల్త్ సబ్ సెంటర్లలో ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. దవాఖాన స్థాయిని పెంచుతూ ఎంబీబీఎస్, బీఏఏంఎస్ డాక్టర్ల ని యామకం చేపట్టింది. పల్లెల్లోనే అ న్ని రకాల వైద్య పరీక్షలు చేసి.. ప్ర తి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. ఆర్ఎంపీ, నకిలీ డాక్టర్ల బెడదను అరికట్టేందుకు కూడా ఈ సబ్సెంటర్లు దోహదపడనున్నా యి. గ్రామీణ ప్రాంతాల ప్రజ లు వైద్యం కోసమే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు గమనించిన సర్కార్ ఈ మేరకు ని ర్ణయం తీసుకున్నది. చిన్నచిన్న సమస్యలతో పట్టణాలకు రాకుండా ఉండాలని, గ్రామాల్లోనే మెరుగైన వైద్య సేవలందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం ఖరీదు కావడంతో నిష్ణాతులైన డాక్టర్లను పల్లెల్లోనే నియమించాలని భావిస్తున్నది.
వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఈ నిర్ణయంతో మేలు జరగనున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా.. చాలామందికి తెలియక ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి రూ.వేలకు వేలు దారబోస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బస్తీ దవాఖానల్లో మహిళలు నెలనెలా చెకప్ చేసుకొని.. తమ హెల్త్ ప్రొఫైల్ను మెయింటెయిన్ చేయడం వల్ల గర్భిణులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా వై ద్యులు బాధ్యత వహిస్తున్నారు. జ్వరాలు, వైరల్ ఫీ వర్లు, ఇతరత్రా వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ఈ హెల్త్ సబ్సెంటర్లకు సొంత భవనాలు నిర్మించాలని భావిస్తున్నది. ఈ మేరకు ఒక్కో సెంటర్కు రూ.20 లక్షల చొప్పున వెచ్చించి పక్కాభవనం నిర్మించనున్నది. క్రిటికల్గా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు కూడా వీలవుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 475 బసీ, పల్లె దవాఖానలను ఏర్పాటు చేయనున్నది.
అన్ని రకాల వైద్య సేవలు..
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పీహెచ్సీలు, ఆ పై గ్రేడ్ కలిగిన వైద్యశాలలన్నింటినీ పల్లె, బస్తీ దవాఖానల్లోకి చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హెల్త్ సబ్సెంటర్లను బలోపేతం చేసి పేదలకు అన్ని రకాల వైద్య సదుపాయాలను అందించనున్నది. ఈ సెంటర్లలో ఏకంగా ఎంబీబీఎస్ డాక్టర్లను నియమిస్తుండడంతో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. వీరికి ప్రభుత్వం గౌరవప్రదమైన వేతనాన్ని అందిస్తున్నది. ఈ దవాఖానల్లో గతంలో వారానికి, నెలకోసారి వైద్య సేవలందించేవారు. ఇకపై 24 గంటలు వైద్య సేవలందించాలనే లక్ష్యంతో పల్లె, బస్తీ దవఖానాలను ఏర్పాటు చేసింది.
రూ.20 లక్షలతో పక్కా భవనాలు..
ఉమ్మడి జిల్లాలోని 475 కేంద్రాలను హెల్త్ సబ్ సెంటర్లుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. ప్రతి హెల్త్ సబ్సెంటర్కు రూ.20 లక్షలతో పక్కాభవనం నిర్మించనున్నది. ఇందుకుగానూ నిధులు మంజూరయ్యాయి. చాలాచోట్ల భవనాలు పూర్తయ్యాయి. పురోగతిలో ఉన్నవాటిని వేగంగా పూర్తి చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో 129, నారాయణపేటలో 43, జోగుళాంబగద్వాలలో 81, నాగర్కర్నూల్లో 124, వనపర్తి జిల్లాలో 98 కేంద్రాలను అప్గ్రేడ్ చేశారు. డాక్టర్లు, ఇతర సిబ్బంది భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించారు.
హెల్త్ ప్రొఫైల్ ఉండేలా చర్యలు..
మహబూబ్నగర్ జిల్లాలో పీహెచ్సీ.. అంతకంటే ఎక్కువ స్థాయి గల వైద్యశాలలన్నింటినీ హెల్త్ సబ్ సెంటర్లుగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి హెల్త్ సబ్సెంటర్లో ఎంబీబీఎస్, బీఏఏంఎస్ ఆయుర్వేద డాక్టర్లను నియమిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోనే అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతోపాటు క్రిటికల్ ఉంటే సమీప ప్రభుత్వ దవాఖానలకు తరలించి వైద్య సేవలందిస్తాం. ప్రభుత్వం పక్కా భవనాలు నిర్మించడానికి నిధులు విడుదల చేసింది. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సబ్ సెంటర్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. – డా.శశికాంత్,అడిషనల్ డీఎంహెచ్వో, మహబూబ్నగర్