మహబూబ్నగర్టౌన్, జనవరి 12 : కంటివెలుగు కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రెండోవిడుత కంటివెలుగు నిర్వహణపై గురువారం హైదరాబాద్ నుంచి అదనపు కలెక్టర్, వైద్యారోగ్యశాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటివెలుగు నిర్వహణపై తాసిల్దార్, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
16వ తేదీలోగా 100శాతం సామగ్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అనంతరం అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 13న ఐడీవోసీ సమావేశ మందిరంలో నిర్వహించనున్న సమావేశానికి కంటివెలుగు బృందాలతోపాటు మండల ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు హాజరు కావాలని ఆదేశించారు. కంటివెలుగు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్వో కృష్ణకు సూచించారు. సమావేశంలో డీపీవో వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.