ధరూరు, ఏప్రిల్ 28 : గతంలో ఎన్నో కష్టాలను చూసిన ప్రజలు స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీగా తరలి రావడమే ఇందుకు నిదర్శనం.. ఎన్నో సంక్షేమ ఫలాలు పొందిన మండల ప్రజలు ధరూరు, చింతరేవులలో నిర్వహించిన రెండు సమ్మేళనాల్లో అత్యధికంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. సర్పంచులు సైతం కార్యక్రమాల్లో ప్రజలకు ఏర్పాట్లు చేయడం ప్రభుత్వంపై వారికున్న అభిమానాన్ని సూచిస్తున్నది. లబ్ధిపొందిన వారు మాట్లాడుతుంటే సభలో పాల్గొన్న ముఖ్యనాయకులు సైతం కరతాళ ధ్వనులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కులసంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు సభలో సంక్షేమ పథకాలతో వారు సాధించిన ప్రగతిని వివరించారు. ప్రభుత్వం సాగు, విద్యుత్, వైద్యం, విద్య, ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్కిట్, పౌష్టికాహారం, 108, 104 వాహనాల ఏర్పాటుతో ప్రజలు ప్రభుత్వానికి ఆత్మీయులుగా మారారు. గొల్ల కురుమలు తమ జీవాలను వెంట తీసుకొచ్చి ప్రజాప్రతినిధులు చేతుల్లో పెట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆత్మీయులకు ఏమాత్రం ఇబ్బంది కలుగుకుండా మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు భోజనాలు, మజ్జిగ ప్యాకెట్లు, అందజేసి సమ్మేళనాలు సక్సెస్ చేసేందుకు ఎంతో శ్రమించారు.
ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రజలు తాము ల బ్ధిపొందిన పథకాల గురించి చెబుతుంటే చాలా సంతోసం కలిగింది. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, సీఎంఆర్ఎఫ్, పతకాలు ఏవిధంగా ఉపయోగపడ్డాయో వివరిస్తుంటే.. వారే ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లుగా రాబోయే ఎన్నికలకు వ్యవహరిస్తారనే నమ్మకం, భరోసా కల్గింది. – రవీందర్రావు, గద్వాల జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి
మండలంలో సాగు సంబురంగా సాగుతున్నది. సాగునీటికి అడ్డంకులను సీఎం కేసీఆర్ అధిగమించి నెట్టెంపాడు ద్వారా 2లక్ష ల ఎకరాలను సస్యశ్యామలం చేశారు. ఈ కారణంగానే ఆత్మీయ సమ్మేళనానికి అన్నదాతలు దండుగా తరలొచ్చారు. ఆసర పింఛన్లు అన్ని రకాల అ వసరాలు తీర్చడంతో పండు ముసలోళ్లు కూడా సభకొచ్చారు. వారు మాతో అనుబంధంగా మాట్లాడి ప్రభుత్వానికి తమ సం పూర్ణ మద్దతు ఉంటుందని ప్రతిజ్ఞ చేయడంతో మా ఎన్నికల విజ యం సభలోనే ఖరారైంది. – ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి