పాలమూరు, జనవరి 9 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి పార్లమెంట్ ఎన్నికలకు ముందే నీళ్లు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఆలోచించామని, దురదృష్టవశాత్తు అవకా శం లేకుండా పోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి మహబూబ్నగర్ రూరల్ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మాజీ మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కరువుకాటకాలతో అల్లాడుతున్న పాలమూరును సస్యశ్యామలం చేసిందన్నారు. త్వరలోనే పాలమూరు నీళ్లు కూ డా తీసుకొచ్చేవారమన్నారు. ప్రస్తుతం ప్రజాపాలనను గాలికొదిలేసి టైంపాస్ చేస్తూ ప్రాజెక్టు పనులు నిలిపివేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం విచారకరమన్నారు. ప్రభుత్వ చర్యలతో మహబూబ్నగర్లో మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కౌలుకు భూములు ఇవ్వడానికి భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. దళితబంధు, గృహలక్ష్మి, బీసీబంధు తదితర పథకాలను రద్దు చేయడం విచారకరమన్నారు.
రెండు లక్షల రుణమాఫీ ప్రకటన చేసి ఆ ఊ సే ఎత్తడం లేదని విమర్శించారు. ప్రతినెలా పింఛన్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నదన్నారు. రైతుబంధు ఇంకా ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యాదాద్రి తరహా మన్యంకొండ అభివృద్ధి చేయాలని భావించగా, పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించి పనులు నిలిపివేసి వెనక్కి పంపించారని విమర్శించారు. పేదలకు ఉపయోగపడే వెయ్యి పడకల దవాఖాన పనులు కూడా నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేసేందుకు ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి నుం చి నట్టింటికి నీళ్లు తీసుకురావడమే కాకుండా అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. సమావేశంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వర మ్మ, వైస్ ఎంపీపీ అనిత, ముడా డైరెక్టర్ ఆంజనేయు లు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దేవేందర్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.