అచ్చంపేట, మే 30: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పేదలకు సర్కార్ దవాఖానల్లో మెరుగైన సేవలందిస్తూ దేశంలోనే మూడోస్థానంలో నిలిచిందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి మంత్రి అచ్చంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.20కోట్లతో నిర్మించిన వంద పడకల దవాఖానను ప్రారంభించారు. అనంతరం దవాఖానలో కలియ తిరిగి అన్ని వార్డులు, గదులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే గువ్వల కోరిక మేరకు అదనంగా పది పడకల ఐసీయూ, డయాలసిస్ సెంటర్, అన్ని విభాగాల వైద్యసేవలతో 140 పడకల దవాఖానగా మారిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 500 బస్తీ దవాఖానలు ప్రారంభించామని.. 3వేల పల్లె దవాఖానలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అచ్చంపేటకు వంద పడకల దవాఖాన మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. లింగాల, అమ్రామాద్, దోమలపెంట, వంగూరు గేట్ వద్ద పీహెచ్సీలు మంజూరు చేయాలని కోరారు.
పట్టణంలో నిర్మించిన 150 డబుల్బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్లో గృహలక్ష్మి పథకం ద్వారా సొం త స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 3లక్షలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో దోపిడీ చేసిందన్నారు. అనంతరం గువ్వల మాట్లాడుతూ పేదలకు మరిన్ని డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. అనంతరం ఎంపీరాములు, టీఎస్యూఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలో పేదలకు డాక్టర్లు అం దుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ ఉదయ్కుమార్, ఆరోగ్యశాఖ కమిషనర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహ్మగౌడ్, మార్కెట్ కమి టీ చైర్పర్సన్ అరుణ, డీఎంహెచ్వో సుధాకర్లా ల్, రమేశ్చంద్ర, ఆర్డీవో పాండునాయక్, తాసీల్దా ర్ కృష్ణయ్య, డీఈ హేమలత, ఇతర శాఖల అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.