నాగర్కర్నూల్(నమస్తే తెలంగాణ)/అచ్చంపేట, అక్టోబర్ 26 : వచ్చేది మన ప్రభుత్వమేనని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసని, చావునోట్లో తలపెట్టి తెలంగాణ కొట్లాడి తెచ్చానని, ఈ ఎన్నికల్లో ప్రజలు పోరాటం చేయాలని, ఈ ఎన్నికల్లో ఏమన్నైతే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అయితదని సీఎం కేసీఆర్ అన్నారు. నాడు 60లక్షల టన్నులున్న తెలంగాణ మా గాణి తెలంగాణ తెచ్చుకున్నాక 3కోట్ల టన్నులకు చేరుకుందని, కాంగ్రెస్ పైరవీకారుల పార్టీ అని, కర్ణాటకలో మూడు గంటల కరెంట్ ఇస్తలేరని, ధరణి ఉండాలన్నా, రైతుబంధు, ధాన్యం కొనుగోళ్ల డబ్బులు పడాలన్నా నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో దుమ్ము రేపేలా బీఆర్ఎస్ను గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో అచ్చంపేట ప్రజా ఆశీర్వాదసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. గతంలో ఎవరు ఏ చేతికిందున్నడో తెలుసన్నారు. ఇయ్యాల లేచినోడు, లెవ్వలేనోడు మాట్లాడుతున్నారని, కేసీఆర్ నీకు దమ్మున్నదా, గాంధీ బొమ్మకాడికి రా అంటడొకడు, కొడంగల్కు రా అంటాడొకడంటూ నా ముందున్న మీ ప్రజలే నా దమ్ము అన్నారు. ఎన్నికలు వస్తుంటయ్, పోతుంటాయని, ప్రజలు గెలిచే పరిస్థితులు రావాలన్నారు. తెలంగాణ కోసం ఊరూవాడా పక్షిలాగా తిరిగానని, తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటుతో పాలమూరులో గంజి, అంబలి కేం ద్రాలు పోయావన్నారు. నాడు పాలమూరులో ఐదు కిలో మీటర్లు నీళ్ల కోసం బిందెలు పట్టుకొనే పరిస్థితులు ఉండేవని, బొంబాయి వలసలు పో యినప్పుడు, పాముకాట్లతో చనిపోయినప్పుడు ఈ కొడుకు ఒక్కడన్నా ఉన్నడా అంటూ మండిపడ్డారు. మీకు దండం పెట్టి చెప్తున్నా… ఇప్పుడు మీరు పోరాటం చేయాలన్నారు. నాడు తెలంగాణ కోసం ఒక్కడ్ని వెళ్లానని, పోరాటంలో నిజాయితీ, దమ్ముండడంతో తెలంగాణ ఇచ్చారచన్నారు. ప దేండ్ల కిందట తెలంగాణ ఎట్లుండే, వలసల బ్రతుకులు, ట్రాన్స్ఫార్మర్ల కాలుడు పరిస్థితులను గుర్తు చేశారు. ఇప్పుడు దేశంలో 24గంటల కరెంట్ ఇ స్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రధా ని మోదీ రాష్ట్రంలోనూ 5గంటల కరెంట్ ఇస్తలేరన్నారు. ప్రజలు నిజానిజాలు గుర్తించాలన్నారు.
తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే ముం దున్నదన్నారు. అలాగే సాగునీటి రంగంలో నాడు 60లక్షల టన్నుల ధాన్యం దిగుబడి ఉంటే ఇప్పు డు 3కోట్ల టన్నులకు చేరి అన్నపూర్ణగా మారిందన్నారు. ముండమోపోళ్లాంటి కాంగ్రెస్సోళ్ల 2కోట్ల టన్నులు కావాలా అంటూ ప్రశ్నించారు. నాడు 24గంటల కరెంట్ ఇస్తానంటే జానారెడ్డి అసాధ్యమన్నారని, అలా ఇస్తే ఏ ఎన్నికల్లో పోటీ చేయనన్నారన్నారు. ఇంటి సంసారంలా పద్ధతితో రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో విధి వంచితులను పింఛన్ల పథకం ద్వారా ఆదుకుంటున్నామన్నారు. పింఛన్లను వేల రూపాయలు చేసింది సీఎం కేసీఆరే అన్నారు. వచ్చేది మన ప్రభుత్వమే అన్నారు. రైతుబంధు పుట్టించిందే కేసీఆర్ అని గుర్తు చేశారు. నాడు రైతులు అప్పులు తీర్చకుంటే తలుపులు తీసుకెళ్లేవారని, పశువులు కొట్టుకుపోయేవారని గుర్తు చేశారు. రైతుల మొఖాలు తెల్లపడాలని రైతుబం ధు తెచ్చానన్నారు. తెలంగాణ వచ్చాక పద్ధతిగా పింఛన్లు పెంచుకుందామని, రాష్ట్రంలో 93లక్షల మంది రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందజేయడం జరుగుతుందన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై 192 కేసులు వేశారన్నారు. రాదనుకున్న తె లంగాణ తీసుకొచ్చానన్నారు. రాష్ట్రంలో కులం లేదు, మతంలేదని, దళితులు, ముస్లింలకు గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు బుద్ధితో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ అరిగోస పెట్టిందని, తెలంగాణ కోసం పోరాడితే 400మందిని పిట్టల్లా కాల్చిందని, లక్షల మందిని జైళ్ల పెట్టిందన్నారు.
తాను 32పార్టీల మద్దతు కూడగట్టి, చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానన్నారు. కిందామీదా పడి రైతులకే భూమిపై అధికారం ఉండాలని ధరణి పథకం తీసుకొచ్చానన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్, భట్టి, రేవంత్ ధరణి తీసేస్తామంటున్నారని విమర్శించారు. రైతుల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని, రైతుబంధు డబ్బు లు, వడ్ల పైసులు ధరణి వల్లే రైతుల ఖాతాల్లో టింగ్ టింగ్ మంటూ పడుతున్నాయన్నారు. ధరణి తీసేస్తే దళారులు వస్తరన్నారు. ధరణి తీసేస్తే వీఆర్వోలు, గిర్దావర్లు వస్తరు, ఆఫీసర్ల చుట్టూ తిరగాల, పహాణీ నకళ్ల కోసం పైరవీకారుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. ధరణితో భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పట్టా పావుగంటలో అవుతుందన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తమంటున్నారు. రైతుబంధు ద్వారా రూ.15వేల కోట్లు ఇస్తున్నం, రూ.2వేల కోట్లన్నా తినవద్దా అనేది కాంగ్రెస్ దురుద్దేశమన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తరని, రైతుబంధు రాం రాం అవుతదని, దళితబంధు జైభీమ్ అవుతదని, కరెంట్ కాట్ల కాలుతదన్నారు. కాంగ్రె స్ పైరవీకారుల పార్టీ అని, ఈ దుర్మార్గులను రానిస్తే పాత కథ మోపైతదన్నారు. కాంగ్రెస్ది 3గంటల కరెంట్ కావాలా.., బీఆర్ఎస్ది 24 గంటల కరెంట్ కావాలా చప్పట్లతో చె ప్పాలనంగా ప్రజలంతా బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ కావాలని పెద్దపెట్టున చప్పట్లతో మద్దతు ప్రకటించారు. దళిత సమాజం ఆలోచించాలని, ఇన్నేళ్లూ ఓటు బ్యాంకుగా దళితులను వాడుకున్నారని, దళితబంధులాంటి పథకాన్ని ఇంతకు ముం దు పాలించిన పార్టీలు పెట్టుంటే దళిత బిడ్డలు ఇప్పుడు రాజుల్లా ఉండేవారన్నారు.
దేశ చరిత్రలో ఏ సీఎం, ప్రధాని నోట నుంచి దళితబంధు పథ కం మాట రాలేదన్నారు. దళిత పెద్దలకు నమస్కా రం చేస్తున్నానన్నారు. ఓడగొడితే మాకు పోయేదేముందని, రెస్ట్ తీసుకుంటామన్నారు. మాకు వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదన్నారు. నిర్ణయం మీ చేతిలో ఉందని నవంబర్ 30వ తారీఖున దుమ్ము రేపాలన్నారు. అచ్చంపేటలో ఉమామహేశ్వర లిఫ్టులాంటి 3లిఫ్టులతో 1.75లక్షల ఎకరాల నుం చి 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్య లు తీసుకుంటానన్నారు. అప్పర్ ప్లాట్కు నీళ్లు ఇ ప్పించే బాధ్యత నాదన్నారు. గువ్వ ల బాలరాజు కోరినట్లుగా వచ్చే ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల్లోనే పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజీ, మంజూరు చేస్తానన్నారు. పోడు కేసులు తీసేస్తామన్నారు. ఇక ఎన్నికల తర్వాత అచ్చంపేటలోనే ఒక్క రోజంతా ఉంటానని, ఎకోటూరిజం, ఉమామహేశ్వరం, క్షేత్రాలను రాష్ట్ర అధికారులతో కలిసి సందర్శిస్తానన్నారు. నాడు కవి గోరటి వెంకన్న, దివంగత సాయిచంద్లు పాలమూరులో నీటి కరువుపై వా గు ఎండిపోయెరా అంటూ పాటలు పాడారని, ఇ ప్పుడు హెలికాప్టర్లో డిండి నుంచి వస్తుంటే దుం దుభీ నది నీటితో నిండుగా, ఈ వాగుపై బాలరాజు కట్టించిన బ్రిడ్జీలు కనిపించాయని వివరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్, క్రీడాశాఖల మం త్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, మధుసూదనాచారి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జెడ్పీచైర్మన్ శాంతికుమారి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు పోకల మనోహర్, అచ్చంపేట ఎన్నికల ఇన్చార్జ్జి ఇంతియాజ్ ఇసాక్ ఉన్నారు.
అచ్చంపేట, అక్టోబర్ 26 : నాపై కుట్రలు చేస్తున్న వారిని రాజకీయ సమాధి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం అచ్చంపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ అచ్చంపేట గడ్డపై కాలుమోపిన సీఎం కేసీఆర్కు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. నన్ను ఈస్థాయికి తీసుకొచ్చి అచ్చంపేట ప్రజల గుం డెల్లో సుస్థిరస్థానాన్ని కల్పించేవిధంగా ఆశీర్వదిస్తూ నాలుగోసారి నాకు బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం ఇచ్చి ఆశీర్వదించిన మన నాయకుడు సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. సీఎం ఆశీర్వదంతో కొంతభాగానికి 60వేల ఎకరాలకు సాగునీరు పారించుకోగలిగామని, అచ్చంపేట లిఫ్టుతో నియోజకవర్గానికి సా గునీరు ఇస్తామన్నారు. ఆయన దీవేనలతో విద్యవ్యవస్థను పటిష్టం చేస్తూ గురుకులాలు పాఠశాలలు మంజూరు చేసుకొన్నామని వివరించారు. అయితే అచ్చంపేటకు జీఎంఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాల మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మించాలని, నియోజకవర్గంలో మరో 20 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని, లింగాల మండలం అంబట్పల్లిని, అచ్చంపేట మండలం సిద్దాపూర్ను మండలాలుగా ఏర్పాటు చేయాల ని సీఎం దృష్టి కి తీసుకెళ్లారు. తనలో ఊపిరున్నంతవరకు అ చ్చంపేట ప్రజల కోసమే బతుకుతానని మరో సారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు.