కల్వకుర్తి రూరల్, అక్టోబర్ 2 : స్వార్థప్రయోజనాల కోసం బీఆర్ఎస్ను వీడిన ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్కర్నూల్ జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్ పార్టీకి కాకుండా తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సూచించారు. మండలంలోని జిళ్లెల్ల గ్రామంలో సోమవారం ఎమ్మె ల్యే జైపాల్యాదవ్తో కలిసి విప్ గువ్వల విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ, జెడ్పీ వైస్చైర్మన్ సీఎం కేసీఆర్ ఆదేశాలను ధిక్కరించి స్వార్థపూరితంగా బీఆర్ఎ స్ను వీడి కాంగ్రెస్లో చేరారని విమర్శించారు. వారిద్దరికి ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన అవకాశాలు కల్పించి ఆదరిస్తే ఆ పదవులకు కళంకం తీసుకొచ్చా రన్నారు. దురాలోచన, దురాశతో కుట్ర పూరితమైన రాజకీయాలు చేస్తున్నార న్నారు. కల్వకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతులని.. వారు బీఆర్ఎస్ను ఎందుకు వీడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. వారికి ప్రజలకు సేవ చేయాలనే ఆ లోచన, తపన లేదని.. పదవి వ్యామోహం, వ్యాపారం చేయడమే లక్ష్యంగా కొ నసాగారని విమర్శించారు.
స్వార్థపూరిత రాజకీయాలు మానుకోవా లని హితవు పలికారు. మంత్రులతో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తూ పైరవీలు చేశారే తప్పా ప్రజా సేవచేయలేదన్నారు. పదవిలో ఉన్నప్పటికీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీ సీనైనా గెలిపించుకున్నాడా అని ప్రశ్నించారు. కల్వకుర్తిలో ఎమ్మెల్యేగా జైపాల్ యాదవ్ను మళ్లీ గెలిపించుకొని గులాబీ జెండా ఎగరవేద్దామన్నారు. కుల రాజకీ యాలు చేసే కాంగ్రెస్, మత రాజకీయాలు చేసే బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. సోనియాగాంధీని బలిదేవత అన్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇప్పుడు తెలంగాణ దేవత అంటూ కొలుస్తున్నాడని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడేవారికి డిపాజిట్లు గల్లంతుకావడం ఖాయమన్నారు. నైతిక విలువలుంటే వెంటనే పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సత్యం, పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి, ఎంపీపీ మనోహర, సర్పంచ్ జంగయ్య, నాయకులు పాల్గొన్నారు.