కోస్గి, మే 6 : కోస్గి కాంగ్రెస్లో నాయకుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఏడాదిన్నరకాలంగా నాయకుల మధ్య చెలరేగిన గ్రూప్ రాజకీయాలకు అధికారులు, వ్యవస్థలు బలవుతున్నాయన్న వాదన మండలమంతా విస్తరించింది. బడా నాయకులు ఒక వర్గాన్నే ప్రోత్సహిస్తుండడంతో మరో వర్గం ఆదిపత్యం కోసం ప్రయత్నాలు మొద లు పెట్టింది. అధికారులు తమ మాట వినడం లేదంటూ పలువురు నాయకులు, కార్యకర్తలు అధిష్టానంతో మొరపెట్టుకుంటున్నారు.
ఇటీవల ఓ కొనుగోలు కేంద్రం ప్రా రంభోత్సవంలో అధికార పార్టీకి చెందిన ఏఎంసీ వైస్ చైర్మన్ ఫొటో ఫ్లెక్సీపై వెయ్యకుండా కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పార్టీ నేతల మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి. మీర్జాపూర్లో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ తన బాధ్యతను మరిచి సర్పంచ్గా ఉన్న తన భార్యను ఇంటికే పరిమితం చేసి ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేశారని గ్రామ నేతలు బహిరంగంగా విమర్శిస్తూ రచ్చకెక్కారు. తానే స ర్పంచ్నని చెప్పుకుంటూ నిభందనలను తుంగలో తొక్కి న ఫీల్డ్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలంటూ సొంత పార్టీ నేతలే అధికారులకు ఫిర్యాదు చేయగా మరో వర్గం ఆ ఫిర్యాదుకు స్పందించొద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
రేవంత్రెడ్డి సీఎం అయినప్పటి నుంచే తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కొందరు సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా రు. ఇది ఇలాగే కొనసాగితే తాము పార్టీలో కొనసాగడం కూడా కష్టమేనని తేల్చి చెప్పారు. గుండుమాల్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సైతం అధికార కాంగ్రెస్లో ఇదే ఆధిపత్య ధోరణి కొనసాగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ మారి కొత్తగా వచ్చిన వారికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడంతో ఈ గ్రూపు తగాదాలు మొదలైనట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.