మాగనూరు, ఫిబ్రవరి 1 : మండలంలోని తాళం కేరి గ్రామ చెరువులో మొసలి కనిపించింది. దీంతో గ్రామస్తు లు భయాందోళన కు గురవుతున్నారు. గురువారం గ్రామానికి చెందిన యువకులకు చెరువు వద్ద మొసలి కనిపించింది. దీనిని గమనించి యువకులు అరవడంతో మొసలి ఒడ్డుపై నుంచి నెమ్మదిగా చెరువులోకి జారుకున్నది.
చెరువులో మొసలి సం చరిస్తుందని తెలియడంతో ప్రజలు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతులు పశువులను తీసుకొని చె రువు వద్దకు వెళ్లవద్దని గ్రామస్తులు సూచిస్తున్నారు. అటవీ అధికారులు స్పందించి చెరువులో మొసలిని బం ధించి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.