ఉండవెల్లి, జూలై 12 : సీఎం కేసీఆర్ కులవృత్తులకు జీవం పోశారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలో గౌడ సం ఘం జిల్లా అధ్యక్షుడు పచ్చర్ల శ్రీధర్గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం గౌడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా మంత్రి శ్రీనివాస్గౌడ్, ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్రెడ్డికి బీఆర్ఎస్, గౌడ సంఘం నాయకులు ఘనస్వాగతం పలికారు. సభా వేదికపై సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. కృష్ణ, తుంగభద్ర నదుల సంగమంతో నడిగడ్డలో సారవంతమైన నల్లరేగడి భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయన్నారు. మా తాతలు, తండ్రి అ లంపూర్ నియోజకవర్గంలోని మునగాల గ్రామవాసులు కావడం.., జోగుళాంబ అమ్మవారు ఇంటి దైవం కావడంతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆలయ అ భివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు చేశానన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అ రాచకాలతో కులవృత్తులు అంతరించిపోయాయని.., స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 450 సంక్షేమ పథకాలను అమలుచేసి కులవృత్తులకు జీవం పోశారన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు రాజకీయాల్లో రాణించాలని కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించామన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న పార్టీలను భూ స్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. నడిగడ్డలో మహాత్మాజ్యోతిరావుఫూలే, సర్వాయి పాపన్న విగ్రహాలను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ కల్లబొల్లి మాటలు చెప్పే పార్టీలను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయగౌడ్, కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, పర్యాటక సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, సర్పంచ్ రేఖ తదితరులు పాల్గొన్నారు.
జోగుళాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి
జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను బుధవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ దర్శించుకున్నారు. వారికి ఆలయ పాలక మండలి చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు, ధర్మకర్తలు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహా మంగళహారతి పూజలు చేశారు. అనంతరం కృష్ణయ్యనాయుడు మంత్రిని శేష వస్ర్తాలతో సత్కరించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఆర్డీవో రాములు, తాసీల్దార్ సుభాష్నాయుడు, మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ తదితరులు ఉన్నారు.
సర్వమతాలకు నిలయంగా తెలంగాణ
దేశంలో ఎవరూ చేయని సాహసం సీఎం కేసీఆర్ చేశారని, ప్రతి గుడిలో ధూపదీప నైవేద్యాలతో నిత్యపూజలు జరిగేలా చర్యలు చేపట్టి సర్వమతాలకు రాష్ర్టాన్ని నిలయం గా తీర్చిదిద్దారని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జోగుళాంబ అమ్మవారి దర్శనం అ నంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. జోగుళాంబ ఆలయాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. 800 ఏండ్ల కిందట కట్టిన రామప్ప ఆలయాన్ని కూడా ప్ర త్యేక రాష్ట్రంలో డెవలప్ చేశామన్నారు. ఆర్కియాలజి నుంచి కొన్ని ఇబ్బందులు ఉ న్నాయని, వాటిని అధిగమిస్తామన్నారు. దేశంలో 96 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తుంటే, తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. జోగుళాంబ క్షేత్రం నుంచే కేసీఆర్ కాలినడక ప్రారంభించారని, ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ ఆల య అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టాలని కోరారు. అనంతరం పట్టణంలో కొనసాగుతున్న ప్రసాద్ స్కీం పనులను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. పనులు నాణ్యతాయుతంగా చే యాలని ఆదేశించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్, నాయకులు పాల్గొన్నారు.