దసరా వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. పాలమూరు మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉత్సవాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు.రావణ దహనం, పటాకుల మోత, సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా చేపట్టారు. మొట్టమొదటి సారిగా ఐలాండ్లో నిర్వహించిన వేడుకలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో ఉత్సవాలకు ఎమ్మెల్యే లు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి హాజరై శమీ వృక్షాలకు పూజలు చేశారు. అనంతరం జమ్మిని పంచుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
జడ్చర్లటౌన్, అక్టోబర్ 24 : విజయదశమి సందర్భంగా జడ్చర్ల పట్టణ ప్రజలు ఘనంగా దసరా పండుగను జరుపుకున్నారు. పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక శమీ పూజలను నిర్వహించారు. స్థానిక వాసవీ కన్యాకపరమేశ్వరీ ఆలయంలో శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. వేంకటేశ్వరస్వామి ఆలయం, రేణుక ఎల్లమ్మ, సకలదేవతల ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాదేపల్లి బాలుర జెడ్పీహైస్కూల్ మైదానంలో వీహెచ్పీ ఆధ్వర్యంలో శమీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జమ్మి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మిని ఒకరినొకరూ పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం జడ్చర్లలోని ఎమ్మెల్యే స్వగృహంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసి శమీ ఇచ్చి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
దసరా పండుగ నేపథ్యంలో జడ్చర్ల పట్టణంలోని మంగళవారం అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టణ రహదారుల మీదుగా అమ్మవారి ఊరేగింపు కొనసాగింది. భజనలు, కొలాటాలతో అమ్మవారి ఊరేగింపు కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
మిడ్జిల్, అక్టోబర్ 24 : మండలంలోని ఆయా గ్రామాల్లో దసరా పండుగను పురస్కరించుకొని కొత్తూర్, రాణిపేట, వాడ్యాల్, వల్లబురావుపల్లి, దోనూర్, బోయిన్పల్లి, భైరంపల్లి, చిల్వేర్, కొత్తూర్, కొత్తపల్లి, వేములతోపాటు ఆయా గ్రామాల ప్రజలు ఆలయాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఆలయాల్లో భక్తిపాటలు ఆలపిస్తూ ఊరేగింపుగా వెళ్లి జమ్మీ చెట్టుకు పూజలు నిర్వహించి ఒకరికొకరు ఆలాయ్-బలాయ్ చేసుకుంటూ పండు గ శుభాకాంక్షలను చెప్పుకున్నారు. అలాగే రావణాసుర దహనం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నా యకులు పాల్గొన్నారు.
బాలానగర్, అక్టోబర్ 24 : విజయదశమి వేడుకలను సోమవారం మండలంలోని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో శమీవృక్షానికి పూజలు నిర్వహించారు. అంతకుముందు కులవృత్తిదారులు, వాహనదారులు అయుధ పూజ చేశారు. మండలంలోని మోతిఘణపూర్లో బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్రెడ్డి, యాదిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అక్కడ జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
రాజాపూర్, అక్టోబర్ 24 : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సోమవారం దసరా వేడుకలను ప్రజలు ఘ నంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పలు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వాహనాలకు పూజలు చేశారు. సాయంత్రం జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్నాయక్, సర్పంచులు సంఘం మండలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, ఎంపీటీసీ అభిమాన్యురెడ్డి పాల్గొన్నారు.
నవాబ్పేట, అక్టోబర్ 24 : మండలంలోని ఆయా గ్రా మాల్లో సోమ, మంగళవారాల్లో విజయదశమి(దసరా) పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయరీతిలో జరుపుకొన్నారు. సోమవారం ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు భారీ ర్యాలీలు నిర్వహించి, హనుమాన్ ఆలయాల వద్ద శమీ పూజ నిర్వహించి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే మంగళవారం పిండి వంటలు, చేసుకొని పండుగ జరుపుకొన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమి టీ చైర్మన్ లక్ష్మయ్య, సర్పంచులు గోపాల్గౌడ్, సౌజన్య, ర ఘు, కృష్ణయ్య, సత్యం, యాదయ్య, లలితమ్మ, జంగయ్య, లక్ష్మమ్మ, మాజీ ఎంపీపీ శీనయ్య, నాయకులు పాల్గొన్నారు.
పాలమూరు, అక్టోబర్ 24 : దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలోని దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. అదేవిధంగా బ్రాహ్మణవాడిలోని వాసవికన్యకాపరమేశ్వరీ ఆలయం నుంచి ప్రారంభమైన అమ్మవారి ఊరేగింపులో మంత్రి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నరేందర్, ఆర్యవైశ్యులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.