అచ్చంపేటరూరల్, జనవరి 18 : మతసామరస్యానికి ప్రతీక అయిన రంగాపూర్లోని హజ్రత్ నిరంజన్ షా వలి ఉర్సు ఘనంగా జరుగుతున్నది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గంధోత్సవాన్ని బుధవారం అర్ధరాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్గాను దర్శించుకుంటున్నారు. ఫాతేహా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. విందు చేసుకొని ఆరగించారు. కుటుంబాలతో కలి సి సరదాగా గడిపారు. ముస్లింలతోపాటు హిందువులు ఉర్సుకు హాజరయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ కృష్ణకిశోర్ ఆధ్వర్యంలో సీఐలు అనుదీప్, ఆదిరెడ్డి, ఎస్సై లు గోవర్ధన్, గురుస్వామి, శేఖర్గౌడ్, రవి బందోబస్తు నిర్వహించారు.
శ్రీశైల ఉత్తర ముఖద్వారంగా బాసిల్లుతున్న ఉ మామహేశ్వర క్షేత్రంలో బ్రహ్మోత్సవ సందడి నెలకొన్నది. గురువారం స్వామికి ప్రత్యేక పూజలు చేశా రు. ఏపీ, తెలంగాణతోపాటు వివిధ ప్రాంతాల నుం చి భక్తులు భారీగా తరలివస్తుండడంతో నల్లమల పులకించిపోయింది. 16వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 20 వేల మంది ద ర్శించుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కందూరు సు ధాకర్, కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్రావు తెలిపారు. హైదరాబాద్, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, కొల్లాపూర్, షాద్నగర్, క ల్వకుర్తి డిపోల నుంచి మినీ బస్సులను తెప్పించి బస్సులను తిప్పుతున్నారు.