మహబూబ్నగర్ : జిల్లాలోని జడ్చర్ల పట్టణంలో ( Jadcherla Town ) గురువారం హనుమాన్ జయంతి ( Hanuman Jayanti ) వేడుకలు కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రకు అడుగడుగునా భక్తులు స్వాగతం పలికారు.
జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో జడ్చర్ల పట్టణం మారుమ్రోగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ప్రజలతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు.
స్వయంగా ట్రాక్టర్ నడిపి, భక్తులతో కలిసి నృత్యం చేశారు.