మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 13 : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కమలాగార్డెన్, హెచ్బీగార్డెన్, రోజ్గార్డెన్లో ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. మైనార్టీ విద్యార్థులకు మె రుగైన విద్య అందించేందుకు రూ.128కోట్లతో కార్పొరేట్ తరహాలో గురుకులాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో 3,230మందికి రూ.లక్షా 116 చొప్పున షాదీముబారక్ చెక్కులను అందజేసినట్లు వివరించారు. రూ.50లక్షలతో షాదీఖానా నిర్మిస్తున్నామని, రంజా న్ సందర్భంగా 4వేలమందికి కానుకలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ కింద 19మందికి రూ.3కోట్ల 42లక్షలు మంజూరు చేసిన ట్లు వెల్లడించారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
యాదవ జాతి ఐక్యతను చాటిన మహనీయుడు బీపీ మండల్
మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 13: బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి బీపీ మండల్ యాదవ జాతి ఐక్యతను చాటి చెప్పారని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ యాద వ కమ్యూనిటీహాల్లో బీపీ మండల్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంత రం మాట్లాడుతూ యాదవులు తమ వృ త్తిని కొనసాగించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. జిల్లాలో మొదటివిడుత రూ.192కోట్లతో 15,368 యూనిట్లను పంపిణీ చేయగా, త్వరలోనే రెండోవిడుత పంపిణీని ప్రారంభిస్తామని తెలిపారు.
జర్నలిస్టులకు సర్కార్ అండ
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 13 : ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో సమాచార, పౌరసంబంధాలశాఖ, వైద్యారోగ్యశాఖ సంయుక్తంగా ఉమ్మడి జిల్లాలోని మహిళా జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్, మైనార్టీ సంక్షేమశాఖ జిల్లా అధికారి టైటస్పాల్, తాసిల్దార్ పార్థసారధి, కౌన్సిలర్లు షబ్బీర్, అనంతరెడ్డి, ఆనంద్గౌడ్, షేక్ ఉమర్, మునీర్, కట్టా రవికిషన్రెడ్డి, నాయకులు మోసీన్, విఠల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అం జద్, కృష్ణమోహన్, రాషాద్, ఖాజాపా షా, చిన్నా, వెంకటనర్సయ్యయాదవ్, శాంతయ్యయాదవ్, సాయిలుయాదవ్, రమేశ్యాదవ్, చందుయాదవ్, కౌన్సిలర్ కోట్ల నర్సింహులుయాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్, జనరల్ దవాఖాన ఆభివృద్ధి కమిటీ సభ్యురాలు లక్ష్మి, సమాచారశాఖ సహా య సంచాలకుడు వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో కృష్ణ, డిప్యూటీ సూపరింటెండెంట్ జీవన్, ఆర్ఎంవో లక్ష్మణ్, డాక్టర్ సంధ్య, డాక్టర్ సృజన పాల్గొన్నారు.