జడ్చర్ల టౌన్, డిసెంబర్ 22 : రైతు అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్చర్ల ఎమ్మె ల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సహకార సం ఘాల నుంచి రుణాలు అందించటంతోపాటు వి త్తనాలు, ఎరువులను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని నాగసాల వద్ద నాబార్డు నిధులు రూ.1.87 కోట్లతో 25 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్ ని ర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రై తు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అం తకు ముందు జడ్చర్లలోని చంద్రాగార్డెన్స్లో క ల్యాణలక్ష్మి, షాదీముబారక్ నుంచి మంజూరైన రూ.1.35 కోట్ల విలువైన చెక్కులను 130 మం ది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పే దింటి ఆడపిల్లల పెండ్లికి ఆర్థికంగా ఆదుకోవాల న్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ షాదీముబారక్, క ల్యాణలక్ష్మి పథకాలను అమలు చేస్తున్నారని చె ప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, వైస్ చైర్మన్ వెంకటయ్య, జెడ్పీ వైస్ చైర్మ న్ యాదయ్య, ఉమ్మడి జిల్లా పీఏసీసీఎస్ చైర్మన్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, బాదేపల్లి విండో చైర్మన్ సుదర్శన్గౌడ్, సర్పంచుల సం ఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్, మున్సిప ల్ వైస్ చైర్పర్సన్ సారిక, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు, ముడా డైరక్టర్లు, సర్పంచు లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.