లింగాల, డిసెంబర్ 3 : ప్రభుత్వం అ మలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం మండలంలో ని కొత్తకుంటపల్లి గ్రామానికి చెందిన 150 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచ్ పర్వతాలు, సింగిల్ విండో డైరెక్టర్ బాల్రాజుగౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి విప్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్నారని తెలిపారు.
అందుక ప్ర జలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పా రు. వారి ఆశీర్వాదంతో ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినట్లు వివరించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అ న్నారు. ప్రతి గడపకూ ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరిందని చెప్పారు. కార్యక్రమం లో మాజీ జెడ్పీటీసీ మాకం తిరుపత య్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కేటీ తిరుపతయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధీర్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రానోజీ, సింగిల్ విండో వైస్ చైర్మన్ వెం కటగిరి, శ్రీనివాసులు, రాజు, సైదుల్పాషా, కుర్మయ్య పాల్గొన్నారు.