అచ్చంపేటటౌన్, డిసెంబర్ 23 : లక్ష్యంతో ముందుకెళ్తే ఏదైనా సాధించొచ్చని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలోని సత్యలక్ష్మి ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన టీఎస్యూటీఎఫ్ 4వ జిల్లా విద్యావైజ్ఞానిక మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యావ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభు త్వం చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంతో విద్యార్థులకు అన్ని వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు.
సీపీఎస్ విధానం రద్దు తదితర సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయడం తగదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య, ప్రధానకార్యదర్శి చావ రవి, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వహీద్ఖాన్, ప్రధానకార్యదర్శి శ్రీధర్శర్మ, నాయకులు కృష్ణ, చిన్నయ్య, శంకర్, రాంచంద్రు, రాము లు, లక్ష్మణ్, బాబూరావు, బాలరాజు, సోమా ని, విజయ్, నరేశ్, రవి, జవహర్ పాల్గొన్నారు.