దేవరకద్ర రూరల్, డిసెంబర్ 22 : క్రైస్తవుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని గురువారం కౌకుంట్ల తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనే క పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. క్రిస్మస్ను అం దరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. నూతనంగా ఏర్పడిన కౌకుంట్ల మండలాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ శివరాజు, జెడ్పీటీసీ అన్నపూర్ణ, సర్పంచ్ స్వప్న, వైస్ఎంపీపీ సుజాత, ఎంపీటీసీ కిష్టన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, గ్రామాధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు.
నాగేందర్ మృతి తీరనిలోటు
విద్యాబోధన, సమాజసేవలో చురుకైన పాత్ర పోషించే లెక్కల మాస్టరు నాగేందర్ మృతి విద్యార్థి లోకానికి తీరనిలోటని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. కౌకుంట్లలో నిర్వహించిన నాగేందర్ సంస్మరణ సభకు హాజరయ్యారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగేందర్ అవయవాలను దానం చేసి 8మందికి ప్రాణాలను కాపాడారని కొనియాడారు. అదేవిధంగా గ్రామానికి చెందిన పూజారి వెంకటేశ్ కుమారుడు అరవింద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, అతడి కుటుంబసభ్యులను పరామర్శించారు. కుటంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్నపూర్ణ, సర్పంచ్ స్వప్న, వైస్ఎంపీపీ సుజాత, ఎంపీటీసీ కిష్టన్న పాల్గొన్నారు.
హైమాస్ట్లైట్లు ప్రారంభం
భూత్పూర్, డిసెంబర్ 22 : మండలంలోని అన్నాసాగర్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్లైట్లను గురువారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ నీలిమ, ఉపసర్పంచ్ రాజారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆల శశివర్ధన్రెడ్డి, ఆల శ్రీకాంత్రెడ్డి, సాబేర్, షాకీర్, చెన్నయ్య, వెంకట్రాములు, కేశవులు పాల్గొన్నారు.