మక్తల్ అర్బన్, మార్చి 31 : జాతీయ స్థాయి గ్రామ పంచాయతీ అవార్డుకు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ఖానాపూర్ గ్రామం ఎంపికైనట్లు ఎంపీడీవో శ్రీధర్ తెలిపారు. గ్రామానికి గుడ్ గవర్నెన్స్ అవార్డు లభించిందన్నారు. శుక్రవారం మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అవార్డులు తీసుకున్నారన్నారు. ఇంటి పన్నులు, పర్మీషన్లు, జనన, మరణ ధ్రువీకరణ ప త్రాల జారీ వంటి వాటిని అధికారులు ఆన్లైన్లో నే చేస్తున్నారు. దీంతోపాటు వైకుంఠధామం, న ర్సరీ, డంపింగ్ యార్డు, క్రీడా ప్రాంగణం ఏర్పా టు చేశారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యు లు కలిసికట్టుగా పనులు చేస్తున్నారు. గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రతి రోజూ శానిటైజేషన్ చేపడుతున్నారు.
మరిచిపోలేని దృశ్యం..
మంత్రుల చేతుల మీదు గా గుడ్ గవర్నెన్స్ అవార్డు అందుకోవడం మరిచిపోలేని దృశ్యం. నారాయణపేట జి ల్లాలో ఖానాపూర్ గ్రామానికి అవార్డు రావడం సంతోషంగా ఉన్నది. అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుం డా అందరికీ సమప్రాధాన్య త ఇవ్వడం అభినందనీ యం. ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో గ్రా మంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. శ్మశానవాటిక, నర్సరీ, డంపింగ్ యార్డు వంటి కార్యక్రమాలతోపాటు సీసీరోడ్లు నిర్మించాం. అధికారుల తోడ్పాటు కూడా ఉన్నది. – నర్సింహులు, సర్పంచ్
పక్కా ప్రణాళికతో ముందుకు..
సీఎం కేసీఆర్ హయాంలో గ్రా మాల్లో ఎంతో అ భివృద్ధి జరుగుతున్నది. పల్లె ప్రగతి లో భాగంగా నర్స రీ, డంపింగ్ యా ర్డు, శ్మశానవాటిక వంటి పనులు పూ ర్తి చేశాం. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాం. అవార్డు రా వడం సంతోషంగా ఉన్నది. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం తో పక్కా ప్రణాళికా ప్రకారం ముందుకెళ్లాం.
– ఎల్లప్ప, ఉప సర్పంచ్