దేవరకద్ర, అక్టోబర్ 21 : బీఆర్ఎస్ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో దేవరకద్ర, కౌ కుంట్ల మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో శ నివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కారు హ యాంలో దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. మ్యా నిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత పదేండ్లలోనే దేశానికి తలమానికంగా మారిందన్నారు. ఇక్కడి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలుకావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే తమకు శ్రీరామరక్ష అని, ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్య క్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నాయన్నారు.
ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాం గ్రెస్ పార్టీ నాయకులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. అనంతరం దేవరకద్ర, కౌకుంట్ల మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన వంద మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో ఎంపీపీలు రమాదేవి, హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్ ఎంపీ పీ సుజాత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరసింహారెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు నరేందర్రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఖదీర్పాషా, సర్పంచులు యుగేందర్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, స్వామి, బుచ్చిరెడ్డి, స్వామి, శివరాజు, భాస్కర్రెడ్డి, నాయకులు కొండారెడ్డి, శ్రీకాంత్ యాదవ్, సత్యం సాగర్, శ్రీనివాస్రెడ్డి, భా స్కర్రెడ్డి, శివానంద్, చల్మారెడ్డి, రాధాకృష్ణ, కిష్టన్న, ఆంజనేయులు, భాస్కర్గౌడ్, మహబూబ్అలీ, సయ్యద్ జక్కి, రంగయ్యగౌడ్, వెంకటేశ్, బాలరాజు పాల్గొన్నారు.
భూత్పూర్, అక్టోబర్ 21 : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు బీఆర్ఎస్పై నమ్మకం పెరుగుతున్నదని ఎమ్మెల్యే ఆల తెలిపారు. మండలంలోని అన్నాసాగర్ గ్రా మంలో మున్సిపాలిటీలోని 4వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 60 మంది, తాటికొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు 40 మంది, కొర్లోవం పు తండాకు చెందిన 40 మంది కాంగ్రెస్ నాయకులు ఎ మ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014కు ముందు నియోజకవర్గంలో 183 వాటర్ ట్యాంక్లు ఉంటే.. తొమ్మిదేండ్లలోనే 230 నిర్మించామన్నారు. కార్యక్రమంలో ముడా డైరెక్టర్ చంద్రశేఖర్గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు నా రాయణగౌడ్, సత్యనారాయణ, మురళీధర్గౌడ్, మాన్యానాయక్, గురు, నర్సింహులు, రాములు, ప్రేమ్కుమార్, భీమస్వామి తదితరులు పాల్గొన్నారు.