పాలమూరు, ఏప్రిల్ 30 : మంగళవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో పాలమూరులోని గెలాక్సీ పాఠశాల విద్యార్థులు 10 జీపీఏ గ్రేడ్స్ సాధించారు. ఫ లితాలలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించా రు. అందులో జీ.వివేక్దత్త, ఎన్.సర్వఘ్న 10జీపీఏ సాధించారు. 38 మందిలో 18మంది 9జీపీఏ సాధించారు. ఈ సందర్భంగా 10 జీపీఏ సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కరస్పాండెంట్ భానుప్రకాశ్తోపాటు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అభినందించారు.