గద్వాల న్యూటౌన్: జిల్లాలో పలు ఆభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, శంకుస్థాపన, నూతన పీజీ కాలేజీ, మినీపార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు మంగళవారం(నేడు) రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రా నున్నారు. దీంతో జిల్లా ఎస్పీ రంజన్త్రన్ కుమార్, డీఎస్పీ రంగస్వామిలు భారీ భద్రత, బందోబస్తుపై ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో జరగబోయే బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు.
అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి భద్రత చర్యలపై పోలీసు అధికారులకు తగు సూచనలు చేశారు. కేటీఆ ర్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో 490మంది పోలీసు సిబ్బందితో పక్కా ప్రణాళికతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చో టుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బాంబుస్యాడ్, జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఇక హైదరాబాద్ బేగం పేట నుంచి ఉదయం 8గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 9 గంటలకు నేరుగా అలంపూర్ కు చేరుకొని 100పడకల దవాఖాన నిర్మాణ పనులకు భూమి పూజ, 10:15 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా ధరూరు మండలం రేవులపల్లికి చేరుకొని పార్క్ భూమి పూజ, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 11గంటలకు గద్వాల మండ లం గోన్పాడు గ్రామంలో ఉర్దుఘర్ కమ్ షాదీఖాన్ భూమి పూజ,11గంటలకు సంగాల పార్కు ప్రారంభం, 12 గంటలకు జిల్లా గ్రంథాలయ బిల్డింగ్, ఏంఏఎల్డీ ఉమేన్స్ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలోని అదనపు గదులు నిర్మాణానికి భూమి పూజ, 12:30నిమిషాలకు నల్లకుంటలోని ఆడిటోరియం, సీసీ రోడ్డు, కమ్యూనిటీ హాల్, మున్సిపల్ కౌన్సిల్ హాల్కు భూమి పూజ కార్యక్రమాలు చేయనున్నారు.
1గంటలకు ఇంటిగ్రెడ్ మార్కెట్ యార్డు నిర్మాణానికి భూమి పూజ, 1:30నిమిషాలకు నూతన ఆర్టీసీ బస్టాండ్కు భూమి పూజ, 2గంటలకు నది అగ్రహారం వద్ద నూతన పీజీ కాలేజీ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక 3:15నిమిషాల కు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు.
4:15నిమిషాలకు తిరిగి కలెక్టరేట్లోని హెలిప్యాడ్ ద్వారా తిరిగి హైదరాబాద్కు బయలు దేరుతారు. దీంతో పోలీసు బందోబస్తుకు దిశానిర్ధేశం చేపట్టా రు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టకుండా ప్రతిపక్ష పార్టీలు, కుల సంఘాలు, విధ్యార్ధి సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేసేందుకు కసరత్తు చేపట్టారు.
490మంది బందోస్తు
కేటీఆర్ పర్యటనలో భాగంగా అలంపూర్ సెగ్మెంట్లో 230మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, 6 సీఐలు, 8 మంది ఎస్సైలతో పాటు కింది స్థాయి సిబ్బంది విధుల్లో ఉంటారు. గద్వాల సెగ్మెంట్లో 260మంది సిబ్బందిలో ఒక ఏఎస్పీ, 3డీఎస్పీలు, 15సీఐలు, 30 మంది ఎస్సైలతో పాటు కింది స్థాయి సిబ్బంది ఇలా మొత్తం 490మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.