అలంపూర్, ఏప్రిల్ 10 : దక్షిణ కాశీగా పేరొందిన జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ క్షేత్రాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ వనరుల శిక్షణ ప్రత్యేకాధికారి డాక్టర్ తాడేపల్లి దర్శించుకున్నారు. ఆదివారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు అధికారికి ఆలయ ఈవో పురేందర్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ బెక్కెం శ్రీనివాసరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శేష వస్ర్తాలతో అర్చకులు సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.