ఉండవెల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధికారం చేపట్టిన ఏడు సంవత్సరాలలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు ఆమలు అవుతు న్నాయని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలంపూ ర్, ఉండవెల్లి మండలాల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే అబ్రహం ఆధ్వర్యంలో చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నదన్నారు.
అలంపూర్ మండలానికి చెందిన 30మంది లబ్ధిదారులకు రూ.30లక్షల 3480లను ఉండవెల్లి మండలానికి చెందిన 18మందికి రూ.18లక్షల 2088చెక్కులను పంపిణీ చేశామని ఎమ్మెల్యే వివరించారు. అదేవిధంగా మానవపాడు మండ లం జల్లాపురం గ్రామానికి చెందిన రైతు నాగరాజు మృతి చెందడంతో భార్య చంద్రకళకు ఐదు లక్షల రూపాయల రైతు బీమా చెక్కును ఎమ్మెల్యే అబ్రహం అందజేశారు.