గద్వాల, డిసెంబర్ 12: రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వం ధ్యేయమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నవరంగ్ థియేటర్లో ‘రైతన్న’ సినిమాను సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తితో కలిసి వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్న సినిమా అద్భుతంగా ఉందని చెప్పారు. కేంద్రం రైతులపై వివక్ష చూపుతుందని ఆరోపించారు. రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉద్యమం చేసే ఉద్యమంలో సుమారు 750మంది రైతులు మరణించారని వారందరికీ కేంద్ర ప్రభుత్వం రూ.25లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో మరణంచిన రైతు కుటుంబాలకు పెద్ద మనస్సుతో సీఎం కేసీఆర్ రూ.3లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం సంతోషకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ప్రతిపాదించిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ,ఎఫ్సీఐ ధాన్యానికి మద్దతు ధర కల్పించి, మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు సినిమాను జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్రాములు, పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీలు ప్రభాకర్రెడ్డి, రాజశేఖర్, వైస్ ఎంపీపీలు సుదర్శన్రెడ్డి, రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, వినియోగదారుల ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, కౌన్సిలర్లు నాగిరెడ్డి, దౌలు, నరహరిగౌడ్, కృష్ణ శ్రీనివాసులు నాయకులు బండ్ల రాజశేఖర్రెడ్డి, విక్రమసింహారెడ్డి, ధర్మారెడ్డి వీక్షించారు.