అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న మోస్తారు వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసాగు తోంది. గురువారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,769 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,511 క్యూసెక్కులు ఉంది. 100. 855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 99.316 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగులకు గాను ప్రస్తుతం 1632.60 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగ మోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు
కర్ణాటకలోని ఎగువన ప్రాంతంలో వానలు తగ్గడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా చేరుతోంది. గురువారం ఆర్డీఎస్ ఆనకట్టకు 5,455క్యూ సెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 5 వేల క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.7 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 455 క్యూసె క్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.