గద్వాలటౌన్, డిసెంబర్ 20 : గద్వాల సంస్థానంలో ఎన్నో ఆలయాలు కొలువుదీరాయి. సంస్థానాధీశుల దై వభక్తికి నిదర్శనంగా ఆలయాలు నిర్మించారు. గద్వాల కోటలోని ఆలయాల నిర్మాణం ఇప్పటికీ వన్నె తగ్గకుం డా ఉన్నాయి. భూలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ సముదాయంలో వేణుగోపాలస్వామి, రామాలయాలు ఉ న్నాయి. ఈ రెండింటిలో కొన్నేండ్ల పాటు నిత్య పూజలు జరగలేదు. కాగా, పన్నెండేండ్ల కిందట ఈ ఆలయాల ను మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి మంత్రాలయ పీఠానికి అప్పగించారు. అప్పటి నుంచి మంత్రాలయ పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిత్యపూజలతోపాటు గద్వాల జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. 2018 వరకు వారు కేవలం ప్రధాన ఆలయంపైనే దృష్టి సారించారు. రామాలయ అభివృద్ధికి కొందరు దాతలు, సంస్థానాధీశుల వారసులు ముందుకు రావడంతో 2019లో పూ ర్వవైభవం వచ్చింది. అదే మాదిరిగా వేణుగోపాలస్వా మి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని పీఠాధిపతి హామీ ఇచ్చారు. కానీ, ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు. కేవలం వాగ్దానాలకే పరిమితమయ్యాయి. రామాలయం శిథిలావస్థకు చేరుకున్నది.
ఆలయాల విశిష్టత..
గద్వాల సంస్థానాధీశుల భక్తికి మెచ్చి చెన్నకేశవస్వా మి ప్రత్యక్షమై దర్శనమిచ్చాడని నాటి కవులు కొనియాడారు. ఈ క్రమంలో మూడు యుగాలను తెలిపేలా కో టలో ఆలయాలను నిర్మించారు. భూలక్ష్మీచెన్నకేశవస్వా మి ఆలయం కృతాయుగాన్ని, రామాలయం త్రేతాయుగాన్ని, వేణుగోపాలస్వామి ఆలయం ద్వాపర యుగాన్ని తెలియజేస్తుంది. రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామిని, ఆ పక్కనే లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి నిత్య పూజలతోపాటు అభిషేకాలు చేశారు. సత్యభామ సమేత వేణుగోపాలస్వామిని కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అమ్మవారిని కొలిస్తే సకల సంపదలు కలుగుతాయని విశ్వాసం. మహాలక్ష్మి అమ్మవారిపై రాణి ఆదిలక్ష్మీదేవమ్మ ఎన్నో కీర్తనలు, స్ర్తోతాలు స్వయంగా రాసేవారని చరిత్రకారులు చెబుతున్నారు. అందుకే అమ్మవారి పేరు మీద ముద్రణాలయం ఏర్పా టు చేసి ఎన్నో గ్రంథాలను రచించారు. శిల్పకళ ఉట్టిపడేలా వేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించగా, నేడు ఆ శిల్పకళ మొత్తం దెబ్బతిన్నది. పట్టించుకునే వారు లేక కళావిహీనంగా మారింది.
కొందరు దుండగులు ఆలయంలో శిల్పసంపదను పూర్తిగా ధ్వంసం చేశారు. సంస్థాన కాలంలో ఆలయ ప్రధాన అర్చకుడైన మా మిళ్లపల్లి పరావస్తు వేంకట వరదాచార్యులు కుమారుడు సం తానగోపాల కథనం మేరకు.. రాణికి దైవభక్తి ఎక్కువగా ఉండడంతో మూడు యుగాలను తెలిపేలా ఆలయాన్ని నిర్మించారు. ఆమె బతికి ఉంటే వేంకటేశ్వరస్వామి ఆలయం కూడా కట్టించేవారు. దీంతో నాలుగు యుగాల ప్రాముఖ్యత గద్వాలకు ఉండేది. నాడు భూలక్ష్మీచెన్నకేశవ స్వామి ఉత్సవాల సందర్భంగా ఐదు రథాలు సాగేవి. దేశంలో ఎక్కడా ఇలా ఉండదు. ఉత్సవాల్లో సంతాన వేణుగోపాలస్వామి, మహాలక్ష్మి అమ్మవారు, శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి, సీతారామలక్ష్మణులు, ఆండాల్ అమ్మవారిని ఒక్కో పల్లకీపై ఊరేగించేవారు. ఆ వైభవాన్ని మళ్లీ కొనసాగించేలా కృషి చే యాలి. ఎంతో విశిష్టిత ఉన్న వేణుగోపాలస్వామి, మ హాలక్ష్మి అమ్మవారి ఆలయాలు శిథిలావస్థకు చేరడం బాధ కలిగిస్తున్నది. ఇప్పటికైనా ఆలయాలను పునురుద్ధరించి నాటి సంస్థానాధీశుల సంస్కృతిని, దైవభక్తిని కాపాడాలని కోరుతున్నాను.
త్వరలో పునరుద్ధరణ పనులు
వేణుగోపాలస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు త్వరలో చేపట్టేలా మంత్రాలయ పీఠాధిపతి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జాతర వరకు ఆలయాన్ని పునఃప్రారంభి పూజలు చేసేలా సంకల్పించారు.
– ప్రభాకర్, ఆలయ విచారణకర్త