నారాయణపేట, ఫిబ్రవరి 8: ఎస్పీ కార్యాలయ నిర్మాణం కోసం మంగళవారం వల్లంపల్లి శివారులోని సర్వే నంబర్ 48ని ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీపీవో బిల్డింగ్ సరిహద్దులను ఏర్పాటు చేయాలని, బిల్డింగ్ సముదాయాల నమూనా మ్యాప్ను రూపొందించాలని ఏఈ సాయికిరణ్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణయ్య, తాసిల్దార్ తిరుపతయ్య, ఆర్ఐ మల్లేశ్, సర్వేయర్ మలేశ్, వీఆర్వో, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.
భూదస్ర్తాల అప్పగింత
ఊట్కూర్, ఫిబ్రవరి 8 : మండలంలోని వల్లంపల్లి శివారులో ఎస్పీ నూతన భవన సముదాయ నిర్మాణానికి సంబంధించిన భూ దస్ర్తాలను ఊట్కూర్ తాసిల్దార్ తిరుపతయ్య మంగళవారం ఎస్పీ వెంకటేశ్వర్లుకు అందజేశారు. జిల్లా కలెక్టర్ హరిచందన ఆదేశాలతో వల్లంపల్లి శివారులోని 48 సర్వే నంబర్లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిలో డీపీవో బిల్డింగ్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు హద్దులు గుర్తించారు. స్థలానికి సంబంధించిన దస్ర్తాలను గ్రామ సర్పంచ్ నర్సప్ప, ఎంపీటీసీ శహనాజ్బేగం, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యుల సమక్షంలో ఎస్పీకి అందజేశామని తాసిల్దార్ తెలిపారు. ఈ క్రమంలోనే భవన నిర్మాణం చేపట్టబోయే స్థలాన్ని ఏఈ సాయికిరణ్తో కలిసి ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్ఐ మల్లేశ్, సర్వేయర్ మల్లేశ్, సిబ్బంది పాల్గొన్నారు.