అయిజ, ఫిబ్రవరి 5 : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా రైతు సంబురాలు నిర్వహించడం సంతోషదాయకమని అలంపూర్ ఎమ్మెల్యే అబ్ర హం అన్నారు. శనివారం మండలంలోని ఉత్తనూర్ ధ న్వంతరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరుగాలం రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారన్నారు. ఏడాదికోమారు నిర్వహించే జాతరల సందర్భం గా పెంచి పోషించిన ఎద్దుల బలా బలాలను తెలుసుకునేందుకు బండలాగుడు పోటీల్లో పాల్గొని మురిసిపోతారన్నారు. ఏడేండ్లలో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. రైతులను రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. టీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నేత తిరుమల్రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఏటా రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో ఉత్తనూర్లో బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు పళ్ల విభా గం పోటీలకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు చెందిన 34 జత ల వృషభరాజములు తరలివచ్చినట్లు దేవస్థాన కమిటీ పే ర్కొన్నది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుందర్రాజు, విండో మాజీ అధ్యక్షుడు రాముడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘునాథరెడ్డి, రిటైర్డ్ వయోజన విద్య రాష్ట్ర సంచాలకులు జనార్దన్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నా యకులు, రైతులు పాల్గొన్నారు.