కలెక్టర్ వల్లూరు కాంత్రి
గద్వాల, ఫిబ్రవరి 8: నాణ్యమైన వస్తువులనే సరఫరా చేయలని కలెక్టర్ వల్లూరి క్రాంతి టెండర్దారులను ఆదేశించారు. జిల్లాలోని షెడ్యూల్డ్ కూలాల వసతి గృహాలకు నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వస్తువులను ఎంపిక చేసేందుకు టెండర్లు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిటీ సభ్యులు, టెండర్దారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 15ప్రీ మెట్రిక్, 2పోస్ట్మెట్రిక్ మొత్తం 17షెడ్యూల్డ్ కులాల వసతి గృహాలకు అవసరమయ్యే వస్తు సామగ్రికి టెండర్లు నిర్వహించామన్నారు. బాలికల వసతి గృహాలకు సీసీ కెమెరాలు, ఇన్వైటర్లను ఏర్పాటు చేసేందుకు టెండర్ నిర్వహించిన్నట్లు వివరించారు. స్టీల్ప్లేట్లు, గ్లాసులు, ఉలాన్ దుప్పట్లు, కుక్కర్లు, టిఫిన్బాక్స్లు, గ్లోబ్మ్యాప్, వసతి గృహ నిర్వహణ రిజిస్టర్లు, గోడ గడియారాలు, గ్యాస్ స్టవ్లు, బొగానాలు తదితర 16 వస్తు సామగ్రికి సంబంధించిన టెండర్లను పూర్తి చేశామని తెలిపారు. టెండర్దారులు తీసుకొచ్చిన శాంపిల్ వస్తువులను కమిటీ సభ్యులు పరిశీలించారు. టెండర్ ప్రక్రియలో తిరుమల ఏజెన్సీ వసపర్తి, నారాయణ ట్రేడర్స్ మహబూబ్నగర్, సిరి సంపద హైదరాబాద్, నటరాజ్ ట్రేడర్స్ సంగారెడ్డి, ఓంశాంతి కామారెడ్డి, శాస్త్రసాయి నల్లగొండ, న్యూ శివ సూపర్ మార్కెట్ వనపర్తి, టెండర్ దారులు పాల్గొన్నారు. నాణ్యతను బట్టి టెండర్ వస్తువులను ఎంపిక చేయడం జరిగింది. టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ వారంలోగా వస్తు సామగ్రిని పంపిణీ చేయాలని టెండర్దారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిని శ్వేతప్రియదర్శిని, రమేశ్బాబు, రేవతి తదితరులు పాల్గొన్నారు.