జోగులాంబ గద్వాల : శివుని అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని చెన్నకేశవ సంగాల పార్కు లో 14 అడుగుల శివుని విగ్రహాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా గా ప్రతిష్టించి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా కేంద్రంలో ప్రజలు సేదతీరడానికి ఒక్క పార్క్ లేకుండా పోయిందన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో చెన్నకేశవ పార్కు దగ్గర మహాశివుని విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు తెలిపారు. పార్కు వచ్చే సందర్శకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరి, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబాయ్, తదితరులు పాల్గొన్నారు.