రంగు రంగుల విద్యుత్ దీపాలు
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 28 : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శివాలయాలను ముస్తాబు చేశారు. బారంబావి శివాలయం, అమరేశ్వర ఆలయం, బాహర్పేట్లోని నీలకంఠ ఆలయం, గాం ధీనగర్లోని లింగయ్య గుడి, మహంకాళి వీధిలోని నారాయణ శివాలయం, హైదరాబాద్ రోడ్డులోని తీర్థంబావి శి వాలయం, సింగార్భేస్లోని శివలింగేశ్వర ఆలయం, అం బేద్కర్ చౌరస్తాలోని జగలింగేశ్వర ఆలయాలకు నిర్వాహకులు సున్నాలు వేసి, రంగు రంగుల విద్యుత్ దీపాలతో స ర్వాంగ సుందరంగా అలంకరించారు. శివరాత్రి సందర్భం గా ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
దత్త క్షేత్రంలో నేడు బ్రహ్మోత్సవాలు
మక్తల్ రూరల్, ఫిబ్రవరి 28 : మండలంలోని పస్పుల క్షేత్రవల్లభాపురంలో కృష్ణానదీ ఒడ్డున వెలిసిన దత్తాత్రేయస్వామి ఆలయంలో ఈనెల 1నుంచి 4వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు దత్తపీఠాధిపతి రామ ప్రసన్నానంద సరస్వతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ కమి టీ అధ్యక్షుడు సర్పంచ్ దత్తప్ప, ఆలయ ట్రస్ట్ ప్రధానకార్యదర్శి రామలింగారెడ్డి, దత్తపీఠం సాహితీ నిర్వాహకురాలు నిరంజన్ మాతాజీ సోమవారం తెలిపారు. ఈనెల 1న మ హా రుద్రాభిషేకం, రథోత్సవం, రాజు భాయ్ బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, 2న శివపార్వతుల క ల్యాణోత్సవం, 4న రేణుకాఎల్లమ్మ బోనాల ఉత్సవాలు ని ర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కోరారు.
శివరాత్రి వేడుకలు
మక్తల్ టౌన్, ఫిబ్రవరి 28 : శివరాత్రి వే డుకలకు శివాలయాలను ముస్తాబు చేశారు. పట్టణంలో ఆజాద్నగర్లోని ఉమామహేశ్వరాలయం, మల్లికార్జునస్వామి ఆలయాల ను సుందరంగా అలంకరించారు. ఆలయాల్లో మహారుద్రాభిషేకం, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమం, శివపార్వతుల కల్యాణోత్సవం, జాగరణ, భజన నిర్వహిస్తామని ఉమామహేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, మల్లికార్జునస్వామి ఆలయ అర్చకులు సోమవారం ప్రకటనలో తెలిపారు.
నేటి నుంచి సిద్దేశ్వరస్వామి ఉత్సవాలు
మద్దూర్, ఫిబ్రవరి 28 : మండలంలోని నాగిరెడ్డిపల్లి సిద్దేశ్వరస్వామి ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజులపా టు నిర్వహించనున్నట్లు సర్పంచ్ గోపాల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. 1న మహారుద్రాభిషేకం, అభిషేకాలు, పూజలు నిర్వహిస్తామన్నారు. 2న రూ.50లక్షలతో పునర్నిర్మాణ పనుల భూమిపూజ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్గౌడ్, కొడంగల్ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు.
ఆలయాలు ముస్తాబు
నారాయణపేట రూరల్, ఫిబ్రవరి 28 : మండలంలోని జాజాపూర్, సింగారం, భైరంకొండ, అవుదుంబర్లతో పా టు ఇతర గ్రామాల్లోని శివాలయాలను శివరాత్రి సందర్భం గా ముస్తాబు చేశారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు.