ఎంపీ రాములు,ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
వెల్దండ, ఫిబ్రవరి 27: ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని, దైవభక్తి తోనే ప్రశాంతత లభిస్తుందని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. ఆదివారం వెల్దండ మండలం కొట్ర గేటు వద్ద 1వ వార్డు కౌన్సిలర్ బాలునాయక్, ఆధ్వర్యంలో గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్, తుల్జాభవాని అమ్మవార్ల ఆలయ నిర్మాణానికి ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొని భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. సీమాంధ్ర పాలనలో ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోని ఆలయాలు నేడు అపురూపంగా మారాయన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చిత్తరంజన్దాస్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీలు భరత్ప్రసాద్, దశరథ్నాయక్, కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ బాలయ్య, సింగిల్విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్లు సూర్యప్రకాశరావు, నూనె యాదమ్మ శ్రీను, మధు, గోవర్ధన్, సర్పంచ్ వెంకటేశ్వరావు, నాయకులు రవీందర్రావు, పెద్దయ్యయాదవ్, ప్రశాంత్, రఘు, నిశాంత్, సోమ్లా, అంజ్యా, విజయ్కుమార్, కడారిరవి ఎల్హెచ్పీఎస్ నాయకులు ఉన్నారు.