టీఆర్ఎస్కేవీ జడ్చర్ల నియోజకవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, ఫిబ్రవరి 27 : టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఆదివారం టీఆర్ఎస్ కార్మిక విభాగం నియోజకవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మిక విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్తోపాటు సభ్యులు విజయకుమార్, మహ్మద్ సాదాబ్, ఖాదర్, పడాల ఆంజనేయులు, మణిదీప్, సాయిరాం, చెన్నయ్య, లక్ష్మమ్మ, నాగయ్య, వెంకటేశ్, సాయిరెడ్డి, మౌలాలి, సరిత, సాయికుమార్, నర్సింగ్, కృష్ణ తదితరులకు నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్మికులు సంతోషంగా ఉండాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. అసంఘటిత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. హమాలీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించడానికి వీలుగా పీఆర్సీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి 24గంటల విద్యుత్ అందించడంతోపాటు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి రైతులకు సాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరగడంతో కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. జడ్చర్లలో కార్మికులకు డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్గౌడ్, చాంద్ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, డైరెక్టర్ సుభాష్, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్రెడ్డి, లత, నందకిశోర్, మహేశ్, మాలిక్షాకీర్, బీకేఆర్, శ్రీనివాస్రెడ్డి, జంగయ్య, వెంకటేశ్గౌడ్, గణేశ్, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.