నారాయణపేట, ఫిబ్రవరి 27 : బ్రి టీష్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దే శాన్ని కాపాడేందుకు తన జీవితాన్నే అర్పించిన చంద్రశేఖర్ ఆజాద్ ఆశ య సాధనకు కృషి చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి నర్సింహులు అన్నారు. ఆజాద్ వర్ధంతి సందర్భం గా పీవైఎల్ ఆధ్వర్యంలో పట్టణంలో ని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రస్తుత పాలకవర్గాలు అనుసరించే వి ధానాలు దేశ ప్రజానికానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరా టం చేసిన దేశ నాయకుల అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా రు. కార్యక్రమంలో అరుణోదయ జిల్లా కోశాధికా రి అంజి, పీవైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
వారసత్వంగా ఉద్యమించాలి
ఊట్కూర్, ఫిబ్రవరి 27 : చంద్రశేఖర్ ఆజాద్ వారసత్వంగా యువత ఉద్యమించాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు కిరణ్ అన్నారు. మండలంలోని పెద్దపొర్లలో ఆజాద్ వర్ధంతిని పీవైఎల్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ జాద్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత యువత, విద్యార్థులపై ఉందన్నారు. కా ర్యక్రమంలో పీవైఎల్ నాయకులు చంద్రకాంత్, కనకరాయుడు, కృష్ణయ్య, లింగప్ప, బాలప్ప, కిష్ట ప్ప, నర్సింహ, అంజప్ప, శ్రీను పాల్గొన్నారు.