ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
అచ్చంపేట, మే 16 : అచ్చంపేట ప్రాంతంలోని నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా తన సొ ంత ఖర్చుతో కోచింగ్ శిబిరం ఏర్పాటు చేశానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేటలో ని షామ్స్ ఫంక్షన్హాల్లో జీబీఆర్ చారిట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు కొనసాగుతున్న ఉచిత కోచింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులు ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సాధించేవిధంగా శిక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. బోధన గురించి, మధ్యాహ్న భోజ నం ఇతర అంశాల గురించి విద్యార్థులనడిగి తెలుసుకున్నా రు. శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కష్టపడి పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలన్నారు. ఈ మూడు నెలలు కష్టపడి చదివితే జీవితం ఆనందంగా ఉంటుందన్నారు. యువత ఎదుగుదలా కోసం ఎంతైన ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
లక్ష్మాపూర్ ఆలయంలో పూజలు
అచ్చంపేట మండలంలోని పీఎన్ లక్ష్మాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన తుల్జాభవానీ ఆలయంలో సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో తుల్జాభవానీ అమ్మవారి పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుల్జాభవానీ అమ్మవారి ఆశీస్సులతో అచ్చంపేట ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శాంతలోక్యానాయక్, జెడ్పీటీసీ ప్రతాప్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షు డు రాజేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.