గద్వాల, ఫిబ్రవరి 21 : జోగుళాంబ గద్వాల జిల్లా దవాఖానకు మంచి రోజులు వచ్చాయి. గతంలో దవాఖానకు వస్తే ఎలాంటి సౌ కర్యాలు ఉండేవి కావు. ప్రతి చిన్న దానికి కర్నూల్ లేదా హైదరాబాద్కు రెఫర్ చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చాక వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా దవాఖానకు విడుతల వారీగా సౌకర్యాలు సమకూరుస్తున్నారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సహకారంతో రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చూశారు. మూడోవేవ్ సమయంలో చిన్నారుల కోసం 10 వెంటిలేట ర్లు ప్రభుత్వం మం జూరు చేసిం ది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే బండ్ల సహకారంతో రూ.80 లక్షలు వెచ్చించి వెంటిలేటర్లు సమకూర్చా రు. 200 మందికి నిరంతరం ఆక్సిజన్ అందించేందుకు ప్లాంటు ఏర్పాటు చేశారు. 52 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు డయాగ్నొస్టిక్ సెంటర్ అందుబాటులోకి వచ్చిం ది. ఇలా విడుతల వారీగా ప్రభుత్వం వసతులు కల్పిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నది. అలాగే జిల్లా దవాఖానకు రూ.12.66 లక్షలతో సీ ఆర్మ్ స్కానర్ మంజూరైంది. గతంలో కాలు, చేయి విరిగితే ఎక్స్రే, స్కానిం గ్ తీసేందుకు దవాఖానలో ఏ పరికరం ఉం డేది కాదు. సీ ఆర్మ్ స్కానర్ ద్వారా ఎముకలు విరిగిన తీవ్రత తెలుసుకోవడంతోపాటు చికిత్స అనంతరం కాళ్లు, చేతుల్లో రాడ్ వేసిన విధానం, గాయం మానడం వంటి అంశాలు తెలుసుకోవచ్చు.