ఖిల్లాఘణపురం, మార్చి 28: ప్రభుత్వ బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిందని, పాఠశాలల్లో విజయవంతం చేయాలని జెడ్పీ సీఈవో వెంకట్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సోమవారం ఎంఈవో ఉషారాణి, ఎంపీడీవో విజయ్కుమార్, ఏఈలతో కలిసి సందర్శించారు. ముందు గా పాఠశాలలో చేపట్టాల్సిన పనులను హెచ్ఎం, ఉపాధ్యాయులను, ఎస్ఎంసీ చైర్మన్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు-మన బడికి ఎంపికైన పాఠశాలను అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతోపాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎంపీడీవో నాగేశ్వర్రెడ్డి, ఎంఈవో లక్ష్మణ్నాయక్ అన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలో బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలలను అధికారుల బృందం సందర్శించారు. ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీవో కురుమయ్య, హెచ్ఎం విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.