గద్వాలటౌన్, డిసెంబర్ 17 : మార్గశిర మాసంలో మహావిష్ణువు ప్రతిరూపంగా దత్తాత్రేయుడు పూజలందుకుంటాడు. శ్రీపాద వల్లభుడిగా.. నృసింహసరస్వతీ గా.. మాణిక్యప్రభుగా.. స్వామిసమర్థగా భావించే దత్తాత్రేయుడు ఆవిర్భవించిన మార్గశిర మాసం శుక్లపూర్ణిమని దత్త జయంతిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న వేడుకల కు దత్త మందిరాలు ముస్తాబయ్యాయి. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
దత్తాత్రేయ ఆవిర్భావం..
పురాణ గాథల ప్రకారం.. సప్తరుషులలో అత్రి మహాముని, ఆయన సతీమణి అనసూయమ్మ సంతానం కో సం ఋక్ష పర్వతంపై చేసిన తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. సంతానం కా వాలని కోరగా.. ముగ్గురం ఒక్కటై జన్మిస్తామని వరమిచ్చారు. త్రిమూర్తి అంశతో దత్తత కావడంతో ఆ సంతా నం దత్తాత్రేయుడిగా వెలుగొందుతున్నాడు. దత్తాత్రేయుడిని శుక్ల పూర్ణిమ రోజున దర్శించుకుంటే త్రిమూర్తుల భాగ్యం దక్కుంతుందని భక్తుల నమ్మకం. సహస్ర నామావళి దత్తగురు చరిత్రను పటిస్తే సకల పాపాలు తొలగుతాయని విశ్వాసం.
దత్త రూపం..
దత్తాత్రేయుడు మూడు తలలు, ఆరు చేతులతో వె లుగొందుతూ ఉంటాడు. మూడు తలలు త్రిమూర్తుల కు సంకేతాలుగా ఉంటాయి. ఆరు చేతుల్లో శంఖం, చ క్రం, త్రిశూలం, ఢమరుకం, జపమాల, కమండలము లు దర్శనమిస్తాయి. మెడలో రుద్రాక్షమాలలు యజ్ఞోపవీతమై ఉంటాయి. పై రెండు చేతుల్లోని శంఖం, చక్రం విష్ణుమూర్తికి.., ఢమరుకం, త్రిశూలం శివుడికి, జపమా ల బ్రహ్మదేవుడికి చిహ్నాలు. వారి వెనుక ఉన్న గోవు మహాలక్ష్మికి గుర్తు. నాలుగు శునకాలు వేదాలకు సంకేతాలని పురాణాలు చెబుతున్నాయి.
మరో కథనం..
పురాణం ప్రకారం.. మహారుషి అత్రి, మహాసాద్వి పతివ్రత శిరోమణి అనసూయమ్మ నివాసం ఉన్న ఆశ్రమంపై త్రిమూర్తులు ప్రయాణిస్తుంటారు. అకస్మాత్తుగా వాహనాలు నిలిచిపోతాయి. ఎందుకు ఆగిపోయారని వాహనాలను త్రిమూర్తులు ప్రశ్నించగా.. మహాప్రతివ త్ర ఇంటిపై నుంచి వెళ్లొద్దని సమాధానం ఇస్తాయి. ఇం దుకు త్రిమూర్తులు అత్రి, అనసూయమ్మలను పరీక్షించదలిచారు. ఒకనాడు బ్రాహ్మణ రూపంలో వారు ఆశ్రమానికి వచ్చి.. భోజనానికి ఉపక్రమించారు. ‘మాకు వ డ్డించే స్త్రీ ఒంటి మీద నూలు పోగు కూడా ఉండకూడ దు’ అని వారు సూచించారు. ఇందుకు అనసూయమ్మ చిరునవ్వుతో అంగీకరిస్తుంది. ‘నేను ప్రతివ్రతను అయి తే ఈ ముగ్గురు పిల్లలుగా మారిపోవాలి’ అని అక్షింతలు చల్లింది. దీంతో ముగ్గురూ పిల్లలుగా మారిపోతారు. భో జనాలు వడ్డించిన తరువాత మళ్లీ అక్షింతలు చల్లి బ్రాహ్మణులుగా మారుస్తుంది. అయితే, అనసూయమ్మకు కలిగిన కోరిక మేరకు మళ్లీ ముగ్గురిని శిశువుల్లా మార్చి ఊయల కట్టి ఆడించసాగింది. త్రిమూర్తులు అనసూయమ్మ ఇంట శిశువుల రూపంలో ఉండిపోవడంతో సకల జగత్తు విస్తుపోయింది. త్రిమూర్తులు లేకుండా పాలించేది ఎలా అంటూ దేవతలు త్రిమూర్తుల సతీమణులను వేడుకున్నారు. దీంతో త్రిమూర్తుల సతీమణులు అనసూయమ్మ ఇంటికి చ్చి తమ భర్తలకు యథారూపం ప్రసాదించాలని వేడుకున్నారు. దీంతో శిశువులను మళ్లీ త్రిమూర్తులుగా మారుస్తుంది. అత్రి, అనసూయమ్మల భక్తికి మెచ్చిన త్రిమూర్తులు వారికి దత్తపుత్రులుగా మారుతున్నట్లు ప్రకటిస్తారు. అలా దత్తాత్రేయుడు జన్మిస్తాడు.
ఆలయాల్లో పూజలు..
దత్తజయంతిని పురస్కరించుకొని జోగుళాంబ గద్వాల జిల్లా నదీ అగ్రహారంలోని దత్త ఆలయం, శం భునాథమఠంలోని దత్త ఆలయం, సాయి మందిరాల్లో శని, ఆదివారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సా యిబాబకు పంచామృతాభిషేకాలు, దత్తహోమం, అనఘాదేవి వ్రతం, దత్త హోమం, పల్లకీసేవ, శేజాహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహణకు ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.