అమ్మవారిని దర్శించుకునేందుకు తరలొచ్చిన భక్తులు
అమ్మను తీసుకురావడానికి పుట్టినింటికి వెళ్లిన ఎడ్ల బండి
గద్వాల రూరల్, ఫిబ్రవరి 8 : నడిగ డ్డ ఇలవేల్పు జములమ్మ క్షేత్రం జనసంద్రమైంది. అమ్మవారిని దర్శించుకోవడానికి మంగళవారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో శామియానాలు వేసుకున్నారు. అమ్మా కరుణించూ.. అంటూ వేడుకున్నారు. కొందరు మహిళలు బైనోళ్ల శబ్ధాలతో పూనకంతో ఊగిపోయారు. 70 వేల మంది భక్తులు అ మ్మను దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సతీశ్కుమార్, ఈవో వీరేశం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చే శారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గ ద్వాల రూరల్ ఎస్సై ఆనంద్ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు.
పుట్టినింటికి ఎడ్ల బండి..
జములమ్మ పుట్టినిళ్లు దివి గ్రామమై న గుర్రంగడ్డ అక్కడ నుంచి మాఘశుద్ధ పౌర్ణమికి ముందు మంగళవారం తల్లి గారి ఊరు నుంచి మెట్టినింటికి తీసుకురావడం ఆనవాయితీ. ఇందుకోసం అ మ్మవారిని దేవస్థానం నుంచి తీసుకురావడానికి సారెను సిద్ధం చేసి భాజా భ జంత్రీలతో ఎద్దుల బండి ఉంచి ఆలయ కమిటీ చైర్మన్, ఈవో పూజలు చేసి ఎడ్ల బండిని సాగనంపారు. సాయంత్రం గుర్రంగడ్డకు చేరుకొని అక్కడ పూజలు నిర్వహించి సంప్రదాయం ప్రకారం మె ట్టినింటికి జమ్మిచేడుకు బుధవారం ఉ దయం తీసుకురానున్నారు. అప్పటి నుంచి ఏడాది పాటు అమ్మవారు భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. సాంస్కృతిక జమ్మిచేడులో కార్యక్రమా లు ఆకట్టుకున్నాయి. యువ క్లాసికల్ డ్యాన్సర్ల నృత్యాలు అలరించా యి. కార్యక్రమంలో జానకీరాములు, మాదవి కాంబ్లె, కృష్ణ, సువందరాజు, సురేశ్, రంగన్న, నాగరాజు, ఆనంద్, బీ సన్న, తోటరాముడు, రవి, శ్రీనివాసు లు, వెంకట్రాములు, చిన్న, లక్ష్మన్న, రా జు, యేసు తదితరులు ఉన్నారు.