అయిజ, ఫిబ్రవరి 6: ధన్వంతరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్తనూర్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న బాస్కెట్బాల్ టోర్నీలో తెలంగాణ, ఏపీ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. శనివారం పోటీలు అట్టహాసంగా ప్రారంభం కాగా, లీగ్ పోటీలు సాగుతున్నాయి. పోటీల్లో 8 మహిళా జట్లు, 12 పురుషుల జట్లు పాల్గొంటున్నాయి. ఆదివారం ఉదయం పురుషుల విభాగం అనంతపురం, నిజాం బాస్కెట్బాల్ అకాడమీ జట్లు తలపడగా.. 62- 61 స్కోరుతో అనంతపురం జట్టు గెలుపొందింది. మహిళా విభాగంలో మహబూబ్నగర్, మేడ్చల్ జట్లు పోటీకి దిగగా, 36- 15 స్కోరుతో మహబూబ్నగర్ గెలుపొందింది. సౌత్ సెంట్రల్ రైల్వే, మల్కాజిగిరి జట్లు తలపడగా 54-27 స్కోరుతో సౌత్ సెంట్రల్ రైల్వే జట్టు గెలుపొందింది. పురుషుల విభాగంలో చిత్తూరు, ట్రినిటీ బాస్కెట్బాల్ క్లబ్ జట్లు పోటీ పడగా 37-20 స్కోరుతో చిత్తూరు జట్టు గెలుపొందింది. మహిళల విభాగంలో హైదరాబాద్, గుంటూరు జట్లు పోటీ పడగా, 61-20 స్కోరుతో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచినట్లు టీబీఏ కార్యదర్శి నార్మన్ ఇసాక్ తెలిపారు. కార్యక్రమంలో టోర్నీ కార్యదర్శి కొట్టం నీలిమ, సీనియర్ కోచ్ నయీముద్దీన్, క్రీడాకారులు పాల్గొన్నారు.