ఇటిక్యాల: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామాలయంలో పునర్వసు నక్షత్రమును పురష్కరించుకొని బుధవారం స్వామి వారి కల్యాణ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు భువనచంద్ర శిష్య బృందం వేదమంత్స్రోశ్ఛారణలతో స్వామి వారి వేడుకలను జరిపించారు.
కన్నుల పండువగా సాగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేపట్టింది. భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ మేనేజర్ సురేందర్రాజు పర్యవేక్షించారు.