గద్వాల: ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మల్దకల్ మండలం నాగర్దొడ్డికి చెందిన రామకృష్ణ చికిత్స నిమిత్తం మంజూరైన రూ.లక్ష, గద్వాల మండలం మేళచెరువుకి చెందిన పెద్ద లక్ష్మణ్ణకు చికిత్స నిమి త్తం మంజూరైన రూ.27,900 సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ, పట్టణాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురై మెరుగైన వైద్యం చేయించుకకోలేని వారి కోసం ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ప్రవేశ పెట్టిందని చెప్పారు. దీని ద్వారా అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన వైద్యం కార్పోరేట్ దవాఖానల్లో అందుతుందన్నారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సరోజమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ రామేశ్వరమ్మ, పీఎసీఎస్ చైర్మన్ సుభాన్, ఎంపీపీ విజయ్, జడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు కృష్ణ, శ్రీను నాయకులు రమేశ్నాయిడు, సవారన్న, రాము తదితరులు పాల్గొన్నారు.