ఆంగ్ల మాధ్యమంతో భవితకు బాటలు
విద్యార్థులను అందల మెక్కిస్తున్న సర్కార్ బడి
ఇంజినీర్లు, డాక్టర్లను అందిస్తున్న సరస్వతీ నిలయం
పదుల సంఖ్యలో ఇంజినీరింగ్ సీట్ల సాధింపు
‘మన ఊరు-మన బడి’తో మౌలిక సదుపాయాలు
కోడేరు, ఫిబ్రవరి 5 : ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. రూ.కోట్లు ఖర్చు చేసి విశాలమైన భవనాలు, సౌకర్యాలు, వసతులు కల్పించింది. ఇదే కోవలోకి కోడేరు ఆదర్శ (మోడల్) పాఠశాల వస్తుంది. 6 నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్ ఆంగ్ల బోధనతో గ్రామీణ విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు పడుతున్నాయి.
దీంతో తొమ్మిదేండ్లుగా ఇంగ్లిష్ మాధ్యమంలో బోధనతో సక్సెస్ దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే ఎందరో విద్యార్థులను ఇంజినీర్లు, డాక్టర్లుగా అందలమెక్కించింది. ఇక్కడ మెరుగైన బోధన అందుతుండడంతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఇంజినీరింగ్ సీట్లు సాధిస్తున్నారు.100కు పైగా విద్యార్థులు బాసరలోని ఐఐఐటీ, ఇంజినీరింగ్, మెడిసిన్, వ్యవసాయ పాలిటెక్నిక్ ఉన్నత చదువులు చదువుతుండగా.. కొందరు ఆర్మీ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అందుకే ప్రతి ఏటా అడ్మిషన్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఇక సర్కార్ అమలు చేస్తున్న ‘మన ఊరు-మన బడి’తో ఈ సరస్వతీ నిలయానికి మరిన్ని మౌలిక సదుపాయాలు అందనున్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలకేంద్రంలోని ఆదర్శ (మోడల్) పాఠశాల, కళాశా ల సక్సెస్ దిశగా దూసుకుపోతున్నది. ఇంగ్లిష్ మీడియం లో భోదిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కు మంచి భవిష్యత్ ఏర్పడుతున్నది. వారిని ఉన్నత శిఖరాల వైపు నడుపుతూ అందలమెక్కిస్తున్నది. 2013లో 6, 7, 8, ఇంటర్ ఫస్టియర్ను ప్రారంభించారు. తరగతి కి 40 మంది విద్యార్థుల చొప్పున ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి ఏడాది అడ్మిషన్లు అం తంత మాత్రంగానే ఉన్నా.. రెండో ఏడాది నుంచి విద్యార్థుల్లో ఆసక్తి పెరిగి జాయిన్ అయ్యేందుకు పోటీ పెరిగిందని ప్రిన్సిపాల్ ఉమైఅస్త్ర తెలిపారు. అడ్మిషన్ల కోసం ధరఖాస్తులు ఎక్కువగా రావడంతో ప్రతి తరగతికి 100 మం ది చొప్పున విద్యార్థులను జాయిన్ చేసుకొని ఏ, బీ సె క్షన్లుగా విభజించారు. ఇంటర్లో ఒక్కో గ్రూపునకు 40 మంది చొప్పున ఏ, బీ సెక్షన్లుగా 20 మందిని విభజిం చి విద్యాబోధన చేస్తున్నారు. ఏటా అడ్మిషన్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుం చి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడంతో విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుంది.
రూ.3 కోట్లతో భవన నిర్మాణం..
కోడేరులోని ఊరగుట్ట సమీపంలో 2013లో ప్రభుత్వం రూ.3 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో పాఠశాల భవనాన్ని నిర్మించింది. పరీక్షలు చే సేందుకు ల్యాబ్ రూంలు, ఫర్నీచర్, ప్లే గ్రౌండ్ వంటి వసతులు కల్పించింది. అనుభవం ఉన్న టీ చర్లచే ఇంగ్లిష్ విద్యాభోదన కొనసాగుతున్నది. వి ద్యార్థులు వివిధ రంగాల్లో రాణించేందుకు 8, 9, 10 తరగతులకు వృత్తి విద్యాకోర్సులు, ఇంటర్ వి ద్యార్థులకు మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, బ్యూటీ అండ్ వెల్నెస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
వంద మందికి పైగా ఉన్నత చదువులు..
2013 నుంచి విద్యాభ్యాసం చేసిన 100 మందికి పై గా విద్యార్థులు బాసరలోని ఐఐఐటీ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఆర్మీ, పాలిటెక్నికల్, ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ వంటి ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. బాసర ఐఐఐటీలో 8 మంది, ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్నకు 12, వ్యవసాయ పాలిటెక్నిక్లో 30, మెడిసిన్లో 3, ఇంజినీరింగ్లో 30, ఆర్మీలో 5, పీజీ పూర్తి చేసినవారు 20 మంది వరకు ఉన్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కోడేరుకు చెందిన మహేశ్ పీయూలో గోల్డ్మెడల్ సాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో స్కాలర్స్ పీహెచ్డీ చేస్తున్నాడు. అలాగే నిర్మల, నందిని ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. లావణ్య, ధరణిదీపిక, మన్సూర్, కార్తీక్, నవీన్, ప్రవీణ్, గురుప్రసాద్, సాయికిరణ్ ఇంజినీరింగ్, పాలిటెక్నికల్ సీట్లు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మోడల్ పాఠశాల, కళాశాలల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో కెరీర్ను పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి ఇక్కడి ప్రిన్స్పాల్, టీచర్ అబ్దుల్ మోసిన్ కో ఆర్డినేటర్లుగా ఉన్నారు.