పీయూ రిజిస్ట్రార్ పిండి పవన్కుమార్
మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 8 : డిగ్రీ 1, 2, 5వ సెమిస్టర్ పరీక్షలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు 16 నుంచి మార్చి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పీయూ రిజిస్ట్రార్ పిండి పవన్కుమార్ తెలిపారు. మంగళవారం పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో డిగ్రీ పరీక్షల నిర్వహణపై పీయూలో రిజిస్ట్రార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రశ్నాపత్రం సిద్ధం చేశామన్నారు. విభాగం-ఏ, విభాగం-బీ విభజించామన్నారు. ప్రతి విభాగం నుంచి ఓపెన్ చాయిస్ పరీక్షలు రాసే వెసులుబాటును కల్పించామని తెలిపారు. అలాగే పరీక్ష నిర్వహణ సమయాన్ని రెండు నుంచి మూడు గంటలు పెంచామన్నారు. డిగ్రీ 1, 3 సెమిస్టర్ పని ది నాలను 14వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ప రీక్షలను వాయిదా వేశామని, థియరీ పరీక్షల తర్వాత నిర్వహిస్తామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్స్, యాజయాన్యాలు, అధ్యాపకులు సవరించిన పరీక్షల నిర్వహణ వివరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో పరీక్ష ని యంత్రణ అధికారి డాక్టర్ రాజ్కుమార్, ఓఎస్డీ డాక్టర్ మధుసూదన్రెడ్డి, జెడీ యూజీ డాక్టర్ కిశోర్, ఏసీవోఈ డాక్టర్ శాంతిప్రియ, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.